Kasibugga Temple Stampede: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు.. కాశీబుగ్గ తొక్కిసలాట స్థలికి జనసేన ఎమ్మెల్యేలు..
- కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట..
- పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఘటనా స్థలికి జనసేన ఎమ్మెల్యేలు, నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasibugga Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు జనసేన నుంచి ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఘటనా స్థలికి వెళ్లాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగ మాధవిలను కాశీబుగ్గ ఘటన మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి పవన్ కల్యాణ్కి నివేదిక అందిస్తారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు పిసిని చంద్రమోహన్, కొరికాన రవికుమార్,. దానేటి శ్రీధర్, గేదెల చైతన్య తదితరులు ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులకు అవసరమైన సేవలందిస్తున్నారు.
Read Also: చలికాలంలో బికినీతో హీట్ పుట్టిస్తున్న గీతిక తివారి..
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో కాశీబుగ్గలో తొక్కిసలాట దుర్ఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు.. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నుంచి ఈ ఘటనపై మాట్లాడిన సీఎం. అత్యంత బాధాకరమైన ఘటన కాశీబుగ్గలో చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.. తుఫాన్లో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరం అన్నారు.. దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేస్తున్నానని వెల్లడించారు.. కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించారు ముఖ్యమంత్రి, ప్రజావేదికకు హాజరైన ప్రజలు.. ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయం లో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం విచారకo.. ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదన్నారు.. ప్రతీ ఒక్కరి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ తరహా చర్యల వల్ల తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ గా వ్యవహరిస్తామని.. తక్షణం కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
-
TG20 తొలి ఛాంపియన్గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
-
Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
-
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
-
US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!