NTV Telugu Site icon

CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!

Cpm

Cpm

CPM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసింది సీపీఎం నేతల బృందం.. సచివాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వైవీ, సీహెచ్ బాబురావు, ప్రభాకర్ రెడ్డి తదితర నేతలు ఈ రోజు చంద్రబాబును కలిసి.. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు.. పనిలో పనిగా.. రాష్ట్రంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు సీపీఎం నేతలు..

Read Also: Raviteja: రెప్పల్’తో డప్పుల్ మోగిస్తేనే మజా!

ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం, పెన్షన్లు రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంపు, త్వరలో అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు సీపీఎం నేతలు.. ఇక, కేంద్రం నుండి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించాలని సీఎంను కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని.. టిడ్కో ఇళ్లు పూర్తి చేయడంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు సీపీఎం నేతలు.