Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu warning: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత కఠినంగా మాట్లాడిన చంద్రబాబు, పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవ్వరూ ప్రవర్తించొద్దని హెచ్చరించారు. తప్పులు చేస్తే నేరుగా హెడ్లైన్స్లోకి వెళ్తారని, అలాంటి పరిస్థితులు రానీయకుండా జాగ్రత్తగా ఉండాలని నేతలకు సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు పని చేసి పార్టీకి చెడ్డపేరు తేవద్దని గట్టిగా చెప్పారు.
నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలపై కసరత్తు చేస్తున్నానని, అయితే ఈ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి కమిటీలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు తెలిపారు. ఎన్నో వడపోతలు, వ్యూహాలతో నూతన కమిటీలను రూపొందించామని చెప్పారు చంద్రబాబు.. సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్తవారికి అవకాశాలు కల్పించామని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని వెల్లడించారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతు తెలిపామని చెప్పారు. చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్చార్జికి పొలిట్బ్యూరోలో స్థానం కల్పించడం ఇందుకు నిదర్శనమని అన్నారు.
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
ఇక, నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించారని చంద్రబాబు కొనియాడారు. కార్యకర్తల శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలం పెరగాలని, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు తనకు గుర్తున్నాయని, వారి కష్టఫలితంగానే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలు, పెన్షన్ల పంపిణీ, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రత్యర్థి పార్టీలపై కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఫేక్ ప్రచారాలకు ఇక కాలం చెల్లిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజలు మీపై ఓ కన్నేసి పెట్టారు.. మీరు ఎవరిని కలుస్తున్నారో గమనిస్తున్నారు.. అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారు అని హెచ్చరించారు… ఫ్లెక్సీల దగ్గర గొడవపడుతున్నారు.. కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నన్ను బాధపెట్టాయి అన్నారు.. ఎన్డీఏలో ఉన్నాం, మన ఉనికి కాపాడుకోవాలి.. ఐకమత్యం కాపాడాలి అని సూచించారు.. కేంద్రానికి, రాష్ట్రానికి చెడ్డపేరు రాకుండా పనిచేస్తున్నాం.. ఈ స్ఫూర్తి గ్రామం వరకు కొనసాగాలని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి