AP Pensions: పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు.. ఎక్కడంటే..?
- జులై 1వ తేదీన పింఛన్ల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం..
- సోమవారం ఉదయం 6 గంటలకే మొదలుకానున్న పింఛన్ల పంపిణీ..
- కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు..
- మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 1వ తేదీన (సోమవారం) పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది.. ఇప్పటికే పింఛన్ల పంపిణీకి సర్వం ఏర్పాటు చేసింది.. నిధులను విడుదల చేయడంతో.. రేపు ఆదివారం కావడం.. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుకానుండడంతో.. బ్యాంకుల నుంచి డబ్బులను కూడా డ్రా చేసిపెట్టుకున్నారు.. ఎన్నికల హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జులై 1వ తేదీ పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పింఛన్ల పంపినీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
Read Also: Car Prices: భారీగా తగ్గిన కార్ల ధరలు..రూ.82,000 వరకు డిస్కౌంట్!
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
అయితే, మేం అధికారలోకి వస్తే పెన్షన్ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే కావడం మరో విశేషం..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!