CM Chandrababu Serious: కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు సీరియస్.. రేపటి సమావేశం రద్దు..!
- ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం..
- సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్..
- పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు ఫోన్..
- ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం..
- రేపటి టీడీపీ నేతల సమావేశం రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు, ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని, ఇతర కృష్ణా జిల్లా నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో దుబాయ్ నుంచి ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు.. ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం.. దీంతో రేపటి టీడీపీ నేతల సమావేశం రద్దు చేశారట నేతలు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రేపటి సమావేశాన్ని పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు.. నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట..
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
కాగా, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య విభేదాలు ఎట్టకేలకు రచ్చకు ఎక్కాయి. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇద్దరు మధ్య వ్యవహారం.. ఇప్పుడు రోడ్ ఎక్కింది. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పి గానే మారారు.. ఆయన చేష్టలతో అధిష్టానం కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది.. దీనికి ప్రధానంగా ఎంపీ కేశినేని చిన్నికి అదే విధంగా కొలికపూడి శ్రీనివాస్ కి మధ్య గ్యాప్ రావటమే కారణం అనేది పార్టీ వర్గాల మాట. ఇప్పటికే రెండుసార్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ కొలికపూడి శ్రీనివాసుని పిలిపించి మీరు మార్చుకోవాలని చెప్పినా ఆయన మాత్రం తన తీరు మార్చుకోలేదు అనేది పార్టీ వర్గాల మాట ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆగ్రహానికి కూడా కొలికిపూడి ఇటీవల గురయ్యారు.. ఆ తర్వాత నుంచి ఆయన కొంత సైలెంట్ గా ఉన్నారు. అయినప్పటికీ ఆయనకి పెద్దగా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది ఎమ్మెల్యే వర్గం మాట.. ఈ సమయంలో ఎంపీ కేశినేని చిన్ని.. తిరువూరు నియోజకవర్గం బాధ్యతలు పూర్తిగా చేప్పట్టడం కూడా అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఎమ్మెల్యే కొలకపూడిపై అధిష్టానం ఆగ్రహంగా ఉండటంతో ఎంపీ కేశినేని చిన్ని స్థానికంగా పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎక్కువగా ఎంపీ వర్గంతోనే టచ్ లో కొనటంతో కొలికపూడికి మరింత మంట పుట్టించడంతోనే.. మరోసారి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం.. దానిపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించడంతో.. మరోసారి కాక రేగడంతో.. చివరకు సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట..
తాజావార్తలు
-
SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!