CM Chandrababu: పెట్టుబడులు-మౌళిక సదుపాయాలపై సమీక్ష.. కీలక అంశాలు ప్రస్తావించిన సీఎం..
- పెట్టుబడులు-మౌళిక సదుపాయాల శాఖపై సీఎం రివ్యూ..
- వివిధ రకాల కార్పొరేషన్లలో అవకతవకలు జరిగాయన్న అంశంపై చర్చ..
- ఫైబర్ నెట్ కనెక్షన్ల లెక్కలు లేవని చెప్పిన అధికారులు..
- కనెక్షన్ల ఛార్జీల సొమ్మును కూడా దోచేసుకున్నారా.. అంటూ ఆశ్చర్యపోయిన ఏపీ సీఎం..
- అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో.. కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ను కడప వైసీపీ కార్యకర్తలతో నింపేశారని ప్రభుత్వం గుర్తించింది.
Read Also: Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..
Also Read
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక, సగం మంది ఉద్యోగులు పనిచేయకుండానే జీతం తీసుకున్నట్లుగా సమీక్షలో తేలింది. ఫైబర్ నెట్ పేరుతో 1500 కోట్ల రూపాయలు రుణం తీసుకొని.. పక్కదారి పట్టించారని చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల నెలవారీ ఛార్జీల డబ్బులను కూడా సొంతానికి వాడేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీజ్ చేసి ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తెరిచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా 9 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. మరోవైపు.. పోర్టుల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.. రామయాపట్నం పోర్టు కాంట్రాక్టర్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కాగా.. కాంట్రాక్టర్ విషయంలో అభ్యంతరాలున్నా.. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయలేమన్నారు చంద్రబాబు. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!