CM Chandrababu: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు..
- పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు..
- ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పర్యటన..
- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.. అనంతరం కోటప్పకొండ త్రికోటేస్వర స్వామిని దర్శించుకోనున్నారు.. ఈ నేపథ్యంలో యల్లమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.. మొత్తంగా పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు.. నిజానికి జనవరి ఒకటో తేదీన, నూతన సంవత్సర వేడుకల్లో భాగంతో పాటు ,పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారని , ముందుగా ప్రచారం జరిగింది.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పులిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు అన్న ప్రచారంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా.. సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
Read Also: Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
జనవరి 1వ తేదీన, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ,పులిపాడు గ్రామంలో కాకుండా, నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం అన్నారంలో సీఎం పర్యటిస్తారు అన్న ప్రచారం జరిగింది.. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి, బీసీ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో, నాయకులు కార్యక్రమాన్ని అక్కడికి మార్చారనేది జరిగిన ప్రచారం.. అక్కడే గ్రామ సభతో పాటు పెన్షన్లు పంపిణీ చేస్తారని ,అధికారులు భావించారు.. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి మళ్లీ ఈరోజు మరొక మార్పు జరిగింది.. తాజాగా నరసరావుపేట మండలం ,ఎలమంద గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అక్కడే పెన్షన్ల పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.. దీనికి తోడు జనవరి ఒకటో తేదీనకాకుండా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 ఉదయాన్నే ,పూర్తి చేయాలన్న ఆలోచనతో, అటు సీఎం కార్యాలయం ,ఇటు టిడిపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎల్లమంద గ్రామంలో పర్యటించారు.. అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు, సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై కూడా సమీక్ష జరిపారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!