CM Chandrababu: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు..
- పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు..
- ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పర్యటన..
- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.. అనంతరం కోటప్పకొండ త్రికోటేస్వర స్వామిని దర్శించుకోనున్నారు.. ఈ నేపథ్యంలో యల్లమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.. మొత్తంగా పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు.. నిజానికి జనవరి ఒకటో తేదీన, నూతన సంవత్సర వేడుకల్లో భాగంతో పాటు ,పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారని , ముందుగా ప్రచారం జరిగింది.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పులిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు అన్న ప్రచారంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా.. సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
Read Also: Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
జనవరి 1వ తేదీన, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ,పులిపాడు గ్రామంలో కాకుండా, నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం అన్నారంలో సీఎం పర్యటిస్తారు అన్న ప్రచారం జరిగింది.. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి, బీసీ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో, నాయకులు కార్యక్రమాన్ని అక్కడికి మార్చారనేది జరిగిన ప్రచారం.. అక్కడే గ్రామ సభతో పాటు పెన్షన్లు పంపిణీ చేస్తారని ,అధికారులు భావించారు.. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి మళ్లీ ఈరోజు మరొక మార్పు జరిగింది.. తాజాగా నరసరావుపేట మండలం ,ఎలమంద గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అక్కడే పెన్షన్ల పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.. దీనికి తోడు జనవరి ఒకటో తేదీనకాకుండా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 ఉదయాన్నే ,పూర్తి చేయాలన్న ఆలోచనతో, అటు సీఎం కార్యాలయం ,ఇటు టిడిపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎల్లమంద గ్రామంలో పర్యటించారు.. అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు, సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై కూడా సమీక్ష జరిపారు.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!