CM Chandrababu: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు..
- పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు..
- ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పర్యటన..
- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.. అనంతరం కోటప్పకొండ త్రికోటేస్వర స్వామిని దర్శించుకోనున్నారు.. ఈ నేపథ్యంలో యల్లమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.. మొత్తంగా పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు.. నిజానికి జనవరి ఒకటో తేదీన, నూతన సంవత్సర వేడుకల్లో భాగంతో పాటు ,పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారని , ముందుగా ప్రచారం జరిగింది.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పులిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు అన్న ప్రచారంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా.. సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
Read Also: Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
జనవరి 1వ తేదీన, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ,పులిపాడు గ్రామంలో కాకుండా, నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం అన్నారంలో సీఎం పర్యటిస్తారు అన్న ప్రచారం జరిగింది.. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి, బీసీ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో, నాయకులు కార్యక్రమాన్ని అక్కడికి మార్చారనేది జరిగిన ప్రచారం.. అక్కడే గ్రామ సభతో పాటు పెన్షన్లు పంపిణీ చేస్తారని ,అధికారులు భావించారు.. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి మళ్లీ ఈరోజు మరొక మార్పు జరిగింది.. తాజాగా నరసరావుపేట మండలం ,ఎలమంద గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అక్కడే పెన్షన్ల పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.. దీనికి తోడు జనవరి ఒకటో తేదీనకాకుండా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 ఉదయాన్నే ,పూర్తి చేయాలన్న ఆలోచనతో, అటు సీఎం కార్యాలయం ,ఇటు టిడిపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎల్లమంద గ్రామంలో పర్యటించారు.. అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు, సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై కూడా సమీక్ష జరిపారు.
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!