Andhra Pradesh: అన్నదాతలకు గుడ్న్యూస్.. డబుల్ ధమాకా..! నేడు ఖాతాల్లో సొమ్ము జమ..
- ఏపీలో రైతన్నలకు శుభవార్త..
- నేడు అన్నదాత సుఖీభవ రెండోవిడత విడుదల..
- లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ ఏడు వేలు జమ..
- కడప జిల్లాలో కార్యక్రమానికి సీఎం హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రైతన్నలకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. నేడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు జమ కానున్నాయి. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాలో రెండో విడతలో ఏడు వేల లెక్కన జమ చేయనుంది ప్రభుత్వం. ఇవాళ కడప జిల్లా కమలాపురం, పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు NPCAలో ఉపయోగించని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తేవాలని క్షేత్ర స్ధాయిలో వ్యవసాయ అధికారులు సమన్వయం చేసుకుని పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Read Also: Indiramma Saree: నేటి నుంచే ఇందిరమ్మ “కోటి” చీరల పంపిణీ.. చివరి తేదీ ఇదే..
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
మరోవైపు న్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయబోతోంది ప్రభుత్వం. రెండో విడతలో మొత్తం 46 లక్షల 62 వేల 904 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా ఈ పథకం మీద సందేహాలు నివృత్తి చేసేందుకు టోల్ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం వాటా 2 వేలు, రాష్ట్ర వాటా 5 వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఒక్కొక్క రైతుకు చెల్లిస్తారు..
ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ – కిసాన్ కార్యక్రమానికి హాజరవుతారు.
సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి షెడ్యూల్..
* మధ్యాహ్నం 1 గంటలకు హెలికాప్టర్ ద్వారా పెండ్లిమర్రి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
* మధ్యాహ్నం 1:20–1:30 గంటలకు వెల్లూరులోని ‘మన గ్రోమోర్’ ఎరువుల కేంద్రాన్ని పరిశీలించనున్న సీఎం.
* మధ్యాహ్నం 1:40 గంటలకు పెండ్లిమర్రిలో నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు.
* సాయంత్రం 4:20 గంటలకు చిన్నదొరపల్లెలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం.
* సాయంత్రం 6 గంటలకు కడప విమానాశ్రయం నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం.
తాజావార్తలు
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..