CM Chandrababu: అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటాం..
- అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటాం..
- భరోసా ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు వెల్లడించారు.. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మిర్చి రైతులను ఆదుకుంటాం.. రైతులు ఎవరు అధైర్య పడొద్దు.. ఒక్కోసారి ధరలు తగ్గుతుంటాయు, పెరుగుతుంటాయి అన్నారు చంద్రబాబు.. ఏపీలో మిరప ఎక్కువ పండిస్తారు. దేశంలో పండే మిరప పంటలో 50 శాతం ఏపీ నుంచే దిగుబడి ఉంటుంది. ఈ సంవత్సరం 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి కొనుగోలు చేయాలి. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పంట మార్కెట్ లోకి వచ్చింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం రైతు నష్టపోయే పరిస్థితి వచ్చింది. గత ఏడాది అంతర్జాతీయంగా మార్కెట్ బాగుండడంతో, మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఏపిలో సాగు చేశారు.. అనూహ్యంగా విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో రైతు నష్టపోయే పరిస్థితి వచ్చిందని.. ఈ పరిస్థితుల్లో మిర్చి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని కేంద్ర మంత్రికి చెప్పాను అన్నారు చంద్రబాబు..
Read Also: Single Boy Story: “బాబు పెళ్లెప్పుడూ..” 30 ఏళ్లు దాటినా పెళ్లి అవ్వక యువకుల బాధలు వర్ణనాతీతం..
అంతేకాదు.. ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకోవాలో సూచించాం. రేపు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, తిరిగి మాకు చెప్తా అన్నారు.. రైతులకు ఖచ్చితంగా మేలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం.. ఏదేమైనా రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎగుమతులు ప్రోత్సహించే దానిపైన కూడా ఆలోచిస్తాను. కేంద్రం, రాష్ట్రం ప్రయత్నాలు చేస్తున్నాయు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే మూడు లేఖలు రాసిన కేంద్రానికి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి రేపు ఢిల్లీ వచ్చి అధికారులతో మాట్లాదాకా స్పష్టత వస్తుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!