Free Sand Scheme: ఉచిత ఇసుక విధానం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
- ఇసుక సరఫరా.. నూతన ఉచిత ఇసుక విధానంపై సీఎం సమీక్ష..
- ఇసుక బుకింగ్ విధానం.. రవాణా.. సులభమైన లావాదేవీలు..
- విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష..
- వెబ్ సైట్.. యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Sand Scheme: ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.. ఆన్లైన్ లేదా గ్రామవార్దు సచివాలయం నుంచి ఇసుక బుకింగ్ చేసుకునేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు.. ఇసుక ఎప్పుడు సరఫరా చేస్తామో కూడా వినియోగదారులకు చెప్పేలా వ్యవస్థ ఉండాలన్న సీఎం. దళారులు, మధ్యవర్తులు కాకుండా సాధారణ ప్రజలకు ఇసుక చేరేలా చూడాలన్నారు..
Read Also: Double Ismart Twitter Review: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్విటర్ రివ్యూ.. పూరి ఈజ్ బ్యాక్!
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఇక, ఇసుక వినియోగంపై థర్డ్ పార్టీ అడిట్ కూడా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఇసుక రీచ్ లకు, స్టాక్ యార్డులకు వెళ్లే అవసరం రాదన్న సీఎం. అలాగే ఇసుక రీచ్ ల వద్ద రద్దీ కూడా తగ్గించవచ్చన్నారు.. ఆన్ లైన్ బుకింగ్ వల్ల రీచ్ ల వద్ద వాహనాల వెయిటింగ్ సమయం తగ్గడంతో పాటు ఇసుక రవాణా చార్జీలు కూడా తగ్గుతాయన్నారు.. ఇసుక రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ చేయాలని తద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకత పెరుగుతుందన్నారు.. ఇసుకను భారీ మొత్తంలో వినియోగించే బల్క్ కస్టమర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. బల్క్ కస్టమర్లుగా ప్రకటించుకున్న వారి వద్దకు తనిఖీ కోసం వెళ్లాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డులు, రీచ్ ల వద్ద మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన ఇసుక అందించాలని స్పష్టం చేశారు.. ఇసుక సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!