Free Sand Scheme: ఉచిత ఇసుక విధానం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
- ఇసుక సరఫరా.. నూతన ఉచిత ఇసుక విధానంపై సీఎం సమీక్ష..
- ఇసుక బుకింగ్ విధానం.. రవాణా.. సులభమైన లావాదేవీలు..
- విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష..
- వెబ్ సైట్.. యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Sand Scheme: ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.. ఆన్లైన్ లేదా గ్రామవార్దు సచివాలయం నుంచి ఇసుక బుకింగ్ చేసుకునేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు.. ఇసుక ఎప్పుడు సరఫరా చేస్తామో కూడా వినియోగదారులకు చెప్పేలా వ్యవస్థ ఉండాలన్న సీఎం. దళారులు, మధ్యవర్తులు కాకుండా సాధారణ ప్రజలకు ఇసుక చేరేలా చూడాలన్నారు..
Read Also: Double Ismart Twitter Review: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్విటర్ రివ్యూ.. పూరి ఈజ్ బ్యాక్!
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఇక, ఇసుక వినియోగంపై థర్డ్ పార్టీ అడిట్ కూడా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఇసుక రీచ్ లకు, స్టాక్ యార్డులకు వెళ్లే అవసరం రాదన్న సీఎం. అలాగే ఇసుక రీచ్ ల వద్ద రద్దీ కూడా తగ్గించవచ్చన్నారు.. ఆన్ లైన్ బుకింగ్ వల్ల రీచ్ ల వద్ద వాహనాల వెయిటింగ్ సమయం తగ్గడంతో పాటు ఇసుక రవాణా చార్జీలు కూడా తగ్గుతాయన్నారు.. ఇసుక రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ చేయాలని తద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకత పెరుగుతుందన్నారు.. ఇసుకను భారీ మొత్తంలో వినియోగించే బల్క్ కస్టమర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. బల్క్ కస్టమర్లుగా ప్రకటించుకున్న వారి వద్దకు తనిఖీ కోసం వెళ్లాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డులు, రీచ్ ల వద్ద మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన ఇసుక అందించాలని స్పష్టం చేశారు.. ఇసుక సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?