CRDA Meeting: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకుంటారా?
- ఈ రోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం..
- కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్..
- గతంలో రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాట్ల కోసం స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం..
- పనులు ప్రారంభించని సంస్థలు..
- ఆయా సంస్ధలకు కాలపరిమితి పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRDA Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా ఈ రోజు రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా.. మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కీలకమైన సీఆర్డీఏ సమావేశానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకునే ఛావ్స్ కన్పిస్తోంది. గతంలో రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాట్ల కోసం స్థలాలు ఇచ్చారు. సుమారు 130కు పైగా సంస్థలకు భూములిచ్చారు. వీటిల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి.
Read Also: Raj Tarun Lavanya Case: హైడ్రామాలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ తల్లితండ్రులు కంప్లైంట్..
Also Read
- YS Jagan : రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
- CM Chandrababu : రెండేళ్ల పాలన.. చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
అయితే, ఆయా సంస్థలు రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు కాల పరిమితి ఉంది. గత ఐదేళ్లు ప్రభుత్వం రాజధాని విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉండడంతో సదురు సంస్థలు రాజధానిలో కార్యాలయాల ఏర్పాట్లు పనులే ప్రారంభించ లేదు. ఇలాంటి కంపెనీలు.. సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరిపారు. కొందరు తమ ఆఫీసులను ప్రారంభించేందుకు సంసిద్ధతను కూడా తెలిపాయి. ఈ క్రమంలో ఆయా సంస్ధలకు కాలపరిమితి పొడిగించాల్సి ఉంటుంది. అథార్టీ సమావేశంలో కాలపరిమితి పెంచే అంశంపై కాలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. అలాగే రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు కౌలు చెల్లింపు విషయంలో కూడా చర్చ జరగనుంది. పదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందనే అంచనాతో నాడు టీడీపీ ప్రభుత్వం పదేళ్ల పాటు కౌలు ఇచ్చేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం ఎక్కడిది అక్కడే ఆగిపోయింది. దీంతో మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లింపులు జరపాలనే డిమాండ్ ఉంది. దీనిపై అథార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతోన్న తొలి సమావేశం కావడంతో రాజధాని నిర్మాణ పనులు.. మౌళిక వసతులు, రిటర్నబుల్ ప్లాట్లు.. మాస్టర్ ప్లాన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!