CM Chandrababu: పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి.. ఆర్టీజీ సమీక్షలో సీఎం
- ఆర్టీజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- ప్రజల సమగ్ర డాటా అనుసంధానం ద్వారా మెరుగైన పౌర సేవలు- సీఎం
- అర్హులకే పథకాలు అందేలా ఆర్టీజీ ఉపయోగపడాలి- చంద్రబాబు
- పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి- ముఖ్యమంత్రి
- త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌర సేవలు- రివ్యూలో వివరించిన మంత్రి లోకేష్.
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్లు ఆర్టీజీఎస్ ద్వారా చేపడుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనుల ప్రగతి గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖలున్నాయని, 128 విభాగాధిపతుల వద్ద 178 డాటా ఫీల్డుల నుంచి 500 టీబీల డాటా లభ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియల్ టైమ్ డాటా అందించే ఏకైక వనరుగా పనిచేయాలని అన్నారు. అన్ని విభాగాల్లోని డాటాను ఒక వేదికపైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డాటా ద్వారా విశ్లేషించాలన్నారు.
Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక సదుపాయ సాధనంగా, అన్ని వేళలా సహాయకారిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులు ఇప్పటికి కూడా తమకు కావాల్సిన ప్రాథమికమైన ధృవీకరణ పత్రాలు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి ధృవీకరణ పత్రాల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఈ విధానం మారాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాల్సిన సేవలన్నీ సులభంగా అందేలా చేయనుందని.. ఆ దిశగా పని చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మంది పౌరులకు సంబంధించి డాటా లేదని అధికారులు వివరించారు. ఈ డాటాను సత్వరం సేకరించి అనుసంధానించే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని గృహాలను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
IND vs SA: శాంసన్ వీర విహారం.. సిక్సులతోనే డీల్
వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు వంద సేవలు పౌరులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ వివరించారు. అలాగే 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలు పొందేలా కూడా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా చేస్తున్నామని వివరించారు. మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. డిజిటల్ సంతకం ఉన్న ధృవీకరణ పత్రాలు భౌతికంగా సమర్పించాల్సిన అవసరంలేదనే నియమ నిబంధనలున్నప్పటికీ అధికారుల్లో చాలా మందికి అవగాహన లేకపోవడంతో విద్యార్థులను, ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులను ఫిజికల్ సర్టిఫికెట్లు పొందుపరచాలని చెప్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ప్రజలు, అధికారులు అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. డాటా మొత్తం అనుసంధానించడం ద్వారా పాలనలోనూ, పథకాల అమలులోనూ పారదర్శకత పెరుగుతుందని, తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సీఎం అన్నారు. ఈ దిశగా డాటా ఇంటిగ్రేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ తప్పని సరి చేసేలా చూడాలని, దానికి అనుగుణంగా ఉన్న సదుపాయాలపై కసరత్తు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదని చెప్పారు.
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో