NDA Meeting: ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ అంశంలో ఇప్పటికే సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ఆ నివేదికపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణపై కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కూటమి నుంచి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
NDA Meeting: నేడు కూటమి నేతల కీలక భేటీ..
- నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్. బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ..
- ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా పిలుపు...
- ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు ఉండే అవకాశం

Ap Political News