AP LPG Supply: ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు.. ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు చేపట్టండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP LPG Supply: గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన కు గురవ్వకుండా చర్యలు తీసుకోవలన్నారు సీఎం చంద్రబాబు… ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని.. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో మరింతగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టిసారించాలన్నారు.
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుందని చెప్పారు. అందువల్ల రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలు వంటి ముఖ్య సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈకేవైసీ మరియు ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజలకు తక్షణం ఉపయోగపడే ప్రత్యామ్నాయాలపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు చేసి, పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మరింతగా విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఏపీలోని Krishna–Godavari Basin (కేజీ బేసిన్) లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
-
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!