Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం
- కోటి వరకూ రుణం ఇస్తాం
- పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్గా ఏపీ మారుతుందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్గా ఏపీ మారింది. గత పాలకులు పరిశ్రమలను తరిమేశారు. ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 100 పార్కులకు భూమి కేటాయించాం. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. బ్యాంకులు కూడా ఎంఎస్ఎంఈలకు రూ.2.11 లక్షల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాయి. బ్యాంకులు కూడా వేగంగా రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నాం. ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. కోటి వరకూ రుణం ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.’’ అని అన్నారు.
‘‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుంది. అధికార కార్యక్రమాలకు, ఫంక్షన్లకు, జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు అంబేద్కర్ కళావేదిక. 4.43 ఎకరాల్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్. ఇంతవరకూ ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో, అమరావతిలోనూ లేదు. భారత ఆర్ధిక వ్యవస్ధ వెన్నెముక MSME రంగం. పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి MSME లకే ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం MSME. ఏపీలో నైపుణ్యం కల వారికి, అన్ని వనరులకు ఎలాంటి కొరత లేదు. MSME సమ్మిట్ 2026 అభివృద్ధికి కీలక మైలురాయి అవుతుంది. 20.77 లక్షల MSME లు రాష్ట్రంలో ఉన్నాయి. తక్కువలో తక్కువ ఒక కోటి MSMEలు ప్రారంభించాలి. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాలలో 175 MSME పార్కులు వస్తాయి. జూలై నాటికి 175 MSME పార్కులు వస్తాయి. ఏపీలో రైతుల సహకారం అమోఘం. మన రాష్ట్రంలో రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. అమరావతికి 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. మరో 17 వేల ఎకరాలు కూడా ఇస్తున్నారు. రైతులు, ప్రైవేటు వ్యక్తులు MSME లకు ముందుకు వస్తే ఇన్సెంటివ్లు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మీద నాకు నమ్మకం ఉంది. 50 వేల కోట్లు డ్వాక్రా రుణాలు తీసుకుని 99.9 శాతం చెల్లించారు.’’ అని తెలిపారు.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!