Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం
- కోటి వరకూ రుణం ఇస్తాం
- పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్గా ఏపీ మారుతుందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్గా ఏపీ మారింది. గత పాలకులు పరిశ్రమలను తరిమేశారు. ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 100 పార్కులకు భూమి కేటాయించాం. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. బ్యాంకులు కూడా ఎంఎస్ఎంఈలకు రూ.2.11 లక్షల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాయి. బ్యాంకులు కూడా వేగంగా రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నాం. ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. కోటి వరకూ రుణం ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.’’ అని అన్నారు.
‘‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుంది. అధికార కార్యక్రమాలకు, ఫంక్షన్లకు, జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు అంబేద్కర్ కళావేదిక. 4.43 ఎకరాల్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్. ఇంతవరకూ ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో, అమరావతిలోనూ లేదు. భారత ఆర్ధిక వ్యవస్ధ వెన్నెముక MSME రంగం. పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి MSME లకే ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం MSME. ఏపీలో నైపుణ్యం కల వారికి, అన్ని వనరులకు ఎలాంటి కొరత లేదు. MSME సమ్మిట్ 2026 అభివృద్ధికి కీలక మైలురాయి అవుతుంది. 20.77 లక్షల MSME లు రాష్ట్రంలో ఉన్నాయి. తక్కువలో తక్కువ ఒక కోటి MSMEలు ప్రారంభించాలి. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాలలో 175 MSME పార్కులు వస్తాయి. జూలై నాటికి 175 MSME పార్కులు వస్తాయి. ఏపీలో రైతుల సహకారం అమోఘం. మన రాష్ట్రంలో రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. అమరావతికి 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. మరో 17 వేల ఎకరాలు కూడా ఇస్తున్నారు. రైతులు, ప్రైవేటు వ్యక్తులు MSME లకు ముందుకు వస్తే ఇన్సెంటివ్లు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మీద నాకు నమ్మకం ఉంది. 50 వేల కోట్లు డ్వాక్రా రుణాలు తీసుకుని 99.9 శాతం చెల్లించారు.’’ అని తెలిపారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
తాజావార్తలు
-
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
-
Allu Arjun: హేటర్స్కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
-
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
-
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్లో..!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!