AP Capital Region: రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?
- సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై చర్చ..
- ఏ సంస్థలకు భూమి కేటాయించారో ప్రకటించిన మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital Region: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యా రాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. ఏ సంస్థకు ఎంత మేర భూమి కేటాయించారో వివరించారు.
Read Also: Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!
Also Read
- Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
- YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
భూకేటాయింపులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు మంత్రి నారాయణ.. GoM కొన్ని సంస్థలకు భూములు కేటాయించేందుకు అనుమతి ఇచ్చిందని వివరించిన ఆయన.. ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు.. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు.. IGNOUకి 0.8 ఎకరాలు.. బసవతారకం ఆస్పత్రికి 15 ఎకరాలు, l&tకి 5 ఎకరాలు.. బ్రహ్మకుమారీస్కి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.. ఇక, సీఆర్డీఏ అధికారులతో కూడా చర్చించాం.. ఈ భూకేటాయింపులు డిసెంబరు నెలాఖరులోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.. ప్రాజెక్టులు కంటిన్యూ చేయడానికి సీఈలతో ఒక కమిటీ వేశామని.. ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.. ఇక, వచ్చే జనవరి నుంచి పనులు మొదలవుతాయని తెలిపారు.. 131 మందికి గతంలో భూములు ఇచ్చాం.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నాం.. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నాం. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!