AP Capital Region: రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?
- సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై చర్చ..
- ఏ సంస్థలకు భూమి కేటాయించారో ప్రకటించిన మంత్రి నారాయణ..
AP Capital Region: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యా రాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. ఏ సంస్థకు ఎంత మేర భూమి కేటాయించారో వివరించారు.
Read Also: Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
భూకేటాయింపులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు మంత్రి నారాయణ.. GoM కొన్ని సంస్థలకు భూములు కేటాయించేందుకు అనుమతి ఇచ్చిందని వివరించిన ఆయన.. ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు.. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు.. IGNOUకి 0.8 ఎకరాలు.. బసవతారకం ఆస్పత్రికి 15 ఎకరాలు, l&tకి 5 ఎకరాలు.. బ్రహ్మకుమారీస్కి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.. ఇక, సీఆర్డీఏ అధికారులతో కూడా చర్చించాం.. ఈ భూకేటాయింపులు డిసెంబరు నెలాఖరులోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.. ప్రాజెక్టులు కంటిన్యూ చేయడానికి సీఈలతో ఒక కమిటీ వేశామని.. ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.. ఇక, వచ్చే జనవరి నుంచి పనులు మొదలవుతాయని తెలిపారు.. 131 మందికి గతంలో భూములు ఇచ్చాం.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నాం.. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నాం. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ.
తాజావార్తలు
-
Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
-
Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
-
Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!