AP Capital Region: రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?
- సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..
- రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై చర్చ..
- ఏ సంస్థలకు భూమి కేటాయించారో ప్రకటించిన మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital Region: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యా రాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. ఏ సంస్థకు ఎంత మేర భూమి కేటాయించారో వివరించారు.
Read Also: Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
భూకేటాయింపులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు మంత్రి నారాయణ.. GoM కొన్ని సంస్థలకు భూములు కేటాయించేందుకు అనుమతి ఇచ్చిందని వివరించిన ఆయన.. ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు.. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు.. IGNOUకి 0.8 ఎకరాలు.. బసవతారకం ఆస్పత్రికి 15 ఎకరాలు, l&tకి 5 ఎకరాలు.. బ్రహ్మకుమారీస్కి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.. ఇక, సీఆర్డీఏ అధికారులతో కూడా చర్చించాం.. ఈ భూకేటాయింపులు డిసెంబరు నెలాఖరులోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.. ప్రాజెక్టులు కంటిన్యూ చేయడానికి సీఈలతో ఒక కమిటీ వేశామని.. ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.. ఇక, వచ్చే జనవరి నుంచి పనులు మొదలవుతాయని తెలిపారు.. 131 మందికి గతంలో భూములు ఇచ్చాం.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నాం.. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నాం. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ.
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..