NTV Telugu Site icon

Adinarayana Reddy: ఏం జరిగిందని ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు..!

Adinarayana Reddy

Adinarayana Reddy

Adinarayana Reddy: ఏం జరిగిందని జగన్ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు? అంటూ మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు.. అందులో వాస్తవాలు చూస్తే దారుణంగా ఉన్నాయి.. గత పాలనలో మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ఆ శ్వేత పత్రంలో ఉన్నాయన్నారు. లోకల్ బాడి ఎన్నికలలో చేసినట్లు 2024 ఎన్నికలలో కూడా చేద్దాం అని జగన్ పన్నాగం పన్నాడు.. కానీ, ఎన్డీయేకి మద్దతుగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు.. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లా ఏపీలో ప్రజలు తీర్పు ఇచ్చారు.. అరాచకం, అకృత్యాలు చేస్తే ప్రజలు సహించరు.. పిల్లవాడికి ఆకలి ఐతే పాలబుడ్డి అడిగినట్లు జగన్ రాష్ట్ర పతి పాలన అడుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: AP Assembly: ఆ ఒక్క మాటతో అసెంబ్లీలో నిల్చున్న 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో నవ్వులు..

నేడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.. నియోజక వర్గాలలో ఎక్కడ కక్ష సాధింపులు ఉండకూడదని, ధర్మబద్ధంగా పాలన ఉండాలి ఆదేశించారన్నారు ఆదినారాయణరెడ్డి.. బాబాయ్ హత్య కేసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి… సీబీఐ కేసు కావాలి అని ఓ సారి, వద్దు అని మరో సారి వైసీపీ పాలకులు డ్రామాలు ఆడారు.. సీబీఐ, ఎన్‌ఐఏ లేకపోతే ఆ కేసుల్లో జగన్ మమ్మల్ని నిందితులుగా మార్చేవారు అంటూ దుయ్యబట్టారు.. ఏం జరిగిందని జగన్ డిల్లి లో గగ్గోలు పెడుతున్నారు.. రాష్ట్రంలో 36 హత్యలు జరిగితే ఆ ఆధారాలు కోర్టుకైన జగన్ ఇవ్వాలి కదా? అని నిలదీశారు. జగన్ కు అధికారం లేక ఒడ్డున పడ్డ చేప పిల్ల మాదిరి కొట్టుకుంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.