Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె , వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కీలక విన్నపం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేశారు.
చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం..
Also Read
- NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
- Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ‘మీ కుటుంబాలను అన్యాయం చేయకండి. రేపు డిప్యూటీ సీఎం కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు’ అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం..
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల క్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు.
క్షమించరాని ప్రాణత్యాగాలు..
కార్మికులు ప్రాణాలు తీసుకోవాలనుకోవడం అత్యంత బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. క్యాబినెట్లో ఈ విషయంపై తీవ్రంగా చర్చించామని, కార్మికులు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని కోరారు. కార్మిక సంఘాలు చర్చలకు ముందుకు వచ్చి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు, కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా క్యాబినెట్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!