Tirumala Parakamani Case: పరకామణి కేసులో.. సీఐడీ, ఏసీబీకి హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Parakamani Case: సంచలనంగా మారిన తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, సంబంధిత విభాగాలకు అనుసరించాల్సిన సూచనలను కూడా కోర్టు స్పష్టంగా తెలియజేసింది. చోరీ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు పూర్తి వెసులుబాటు కల్పించింది.. కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.
Read Also: Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ఈ కేసు ఒక దశలో లోక్ అదాలత్లో రాజీ వివాదం జరిగినప్పటికీ, అది దర్యాప్తులో అడ్డంకిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి రవికుమార్ ఆస్తులపై విచారణను కొనసాగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దర్యాప్తు సమర్థవంతంగా సాగేందుకు ఇరు సంస్థలు సేకరించిన ఆధారాలు, సమాచారం, వివరాలను పరస్పరం పంచుకోవాలని హైకోర్టు సూచించింది. ఇది కేసు నిజానిజాలు వెలికితీయడంలో కీలకంగా ఉంటుందని కోర్టు పేర్కొంది.
కోర్టు మరో కీలక నిర్ణయంగా, అప్పటి టీటీడీ CVSO వై. సతీష్కుమార్ పోస్టుమార్టం సర్టిఫికేట్ను సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు అందజేయాలని సీఐడీకి ఆదేశించింది. ఈ రిపోర్ట్ కేసు దర్యాప్తులో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సూచనలు ఉన్నాయి. ఇక, దర్యాప్తు సమయంలో అవసరమైతే సేకరించిన సమాచారం, ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department), ఈడీ (Enforcement Directorate) తో పంచుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది. ఈ చర్య ద్వారా ఆర్థిక అక్రమాలపై మరింతగా వెలుగు పడే అవకాశం ఉంది. సీఐడీ మరియు ఏసీబీ డీజీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. విచారణలో తదుపరి చర్యల దిశగా ఇది ముఖ్యమైన మలుపు అని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుపై హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి మరిన్ని నివేదికలు, ఆధారాలు సమర్పించాల్సి ఉండొచ్చు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
-
DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా ‘ఆధార్’ లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!