Tirumala Parakamani Case: పరకామణి కేసులో.. సీఐడీ, ఏసీబీకి హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Parakamani Case: సంచలనంగా మారిన తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, సంబంధిత విభాగాలకు అనుసరించాల్సిన సూచనలను కూడా కోర్టు స్పష్టంగా తెలియజేసింది. చోరీ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు పూర్తి వెసులుబాటు కల్పించింది.. కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.
Read Also: Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
Also Read
ఈ కేసు ఒక దశలో లోక్ అదాలత్లో రాజీ వివాదం జరిగినప్పటికీ, అది దర్యాప్తులో అడ్డంకిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి రవికుమార్ ఆస్తులపై విచారణను కొనసాగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దర్యాప్తు సమర్థవంతంగా సాగేందుకు ఇరు సంస్థలు సేకరించిన ఆధారాలు, సమాచారం, వివరాలను పరస్పరం పంచుకోవాలని హైకోర్టు సూచించింది. ఇది కేసు నిజానిజాలు వెలికితీయడంలో కీలకంగా ఉంటుందని కోర్టు పేర్కొంది.
కోర్టు మరో కీలక నిర్ణయంగా, అప్పటి టీటీడీ CVSO వై. సతీష్కుమార్ పోస్టుమార్టం సర్టిఫికేట్ను సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు అందజేయాలని సీఐడీకి ఆదేశించింది. ఈ రిపోర్ట్ కేసు దర్యాప్తులో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సూచనలు ఉన్నాయి. ఇక, దర్యాప్తు సమయంలో అవసరమైతే సేకరించిన సమాచారం, ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department), ఈడీ (Enforcement Directorate) తో పంచుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది. ఈ చర్య ద్వారా ఆర్థిక అక్రమాలపై మరింతగా వెలుగు పడే అవకాశం ఉంది. సీఐడీ మరియు ఏసీబీ డీజీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. విచారణలో తదుపరి చర్యల దిశగా ఇది ముఖ్యమైన మలుపు అని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుపై హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి మరిన్ని నివేదికలు, ఆధారాలు సమర్పించాల్సి ఉండొచ్చు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..