Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ డిస్కమ్ల నుంచి APRAPL పరిధిలోకి వ్యవసాయ ఫీడర్ ఆస్తుల బదిలీ జరగనుంది. అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్కు పంపిణీ లైసెన్స్ మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోలార్ విద్యుత్ సరఫరా కోసం APRAPL మరియు డిస్కమ్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. దశలవారీగా 11KV ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ బాధ్యతలు తీసుకోనుంది.. APRAPL.. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి ఆస్తుల బదిలీ ప్రక్రియ జరగనుంది.. వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్..
Read Also: Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్లో దాచిన నిందితుడు.!
Also Read
మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రైతులకు సౌర విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా అందించేందుకు కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడం, సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించడం లక్ష్యంగా నిర్ణయించింది. కొత్త కార్పొరేషన్కు డిస్కంల ఆస్తులను బదలాయించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీ ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సంబంధిత మౌలిక సదుపాయాలు, పరికరాలు, ఇతర ఆస్తులను క్రమంగా కొత్త సంస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ ఆస్తుల బదిలీ అమలు అధికారాన్ని ప్రభుత్వం అప్పగించింది. బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా, కొత్త కార్పొరేషన్ విద్యుత్ పంపిణీ లైసెన్స్ కోసం Andhra Pradesh Electricity Regulatory Commissionకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగం పెరగడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!