Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ డిస్కమ్ల నుంచి APRAPL పరిధిలోకి వ్యవసాయ ఫీడర్ ఆస్తుల బదిలీ జరగనుంది. అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్కు పంపిణీ లైసెన్స్ మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోలార్ విద్యుత్ సరఫరా కోసం APRAPL మరియు డిస్కమ్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. దశలవారీగా 11KV ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ బాధ్యతలు తీసుకోనుంది.. APRAPL.. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి ఆస్తుల బదిలీ ప్రక్రియ జరగనుంది.. వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్..
Read Also: Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్లో దాచిన నిందితుడు.!
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రైతులకు సౌర విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా అందించేందుకు కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడం, సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించడం లక్ష్యంగా నిర్ణయించింది. కొత్త కార్పొరేషన్కు డిస్కంల ఆస్తులను బదలాయించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీ ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సంబంధిత మౌలిక సదుపాయాలు, పరికరాలు, ఇతర ఆస్తులను క్రమంగా కొత్త సంస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ ఆస్తుల బదిలీ అమలు అధికారాన్ని ప్రభుత్వం అప్పగించింది. బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా, కొత్త కార్పొరేషన్ విద్యుత్ పంపిణీ లైసెన్స్ కోసం Andhra Pradesh Electricity Regulatory Commissionకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగం పెరగడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..