Amaravati: అమరావతి రాజధాని కోసం మరో 30 వేలు భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5000 వేల ఎకరాల భూమి అవసరం అని అంచనా వేస్తుంది. దీంతో 20 వేల ఎకరాలు పూలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, స్పోర్ట్స్ సిటీకి 2 వేల ఎకరాల అవసరం. దీనికి 8 వేల ఎకరాల పూలింగ్ చేయనున్నారు.
Read Also: Merugu Nagarjuna: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు
ఇక, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణం కోసం మరో 2000 ఎకరాల భూమి అవసరం కాగా.. దాని కోసం 8000 ఎకరాల సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సర్కార్ చూస్తుంది. ఇక, రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్స్ ఇవ్వగా తక్కువ భూమి ప్రభుత్వం వద్ద మిగిలే అవకాశం ఉంది. దీని కోసం భూసేకరణ చేయాలా, భూ సమీకరణ చేయాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. భూ సేకరణ కన్నా భూ సమీకరణ కావాలని రైతులు కోరుతున్నారని ప్రభుత్వం చెబుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు మాదిరిగా భూసేకరణ చేసే అంశం కూడా పరిశీలన చేస్తున్నారు. ఇక, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం పేర్కొంటుంది.