AP Government: జర్నలిస్టులకు గుడ్న్యూస్..
- జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
- జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు..
- రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయం..
- ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. త్వరలో ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై విధివిధానాలను రూపొందించనుంది.. వాటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత.. ఇళ్ల స్థలాలపై ఓ నిర్ణయం తీసుకోనుంది కూటమి ప్రభుత్వం..
Read Also: US Debt Hits Record: అప్పుల కుప్పగా అగ్రరాజ్యం అమెరికా.. కారణం ఇదేనా..?
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
కాగా, రెవెన్యూశాఖ పని తీరు.. భూ సమస్యల పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు.. 4 లక్షలు పైగా ఉన్నాయి. అభ్యంతరం లేని భూముల పరిష్కారం జీవో 30తో రెగ్యులైజెషన్ జరుగుతుందన్నారు.. సుపరిపాలన.. తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్దీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.. పేదలకు ఇళ్లు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు..
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!