Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
- రిలయన్స్తో చేతులు కలిపిన ట్రంప్..
- అమెరికాలో 50 ఏళ్ల తర్వాత కొత్త ఆయిల్ రిఫైనరీ
- రూ.25 లక్షల కోట్ల భారీ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Reliance Deal: అమెరికా ఇంధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత అర్ధ శతాబ్ద కాలంగా (50 ఏళ్లు) అమెరికాలో ఒక్క కొత్త ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం (Oil Refinery) కూడా నిర్మించలేదు. అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామి కావడం విశేషం. టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో ఈ కొత్త రిఫైనరీని నిర్మించనున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. దీని విలువ దాదాపు $300 బిలియన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 25 లక్షల కోట్లకు పైమాటే).
READ ALSO: Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..
Also Read
- Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
- Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
50 ఏళ్లుగా అమెరికా ఎందుకు మౌనంగా ఉందంటే..
ఈ చారిత్రాత్మక పెట్టుబడి పెడుతున్నందుకు భారతదేశానికి, ప్రత్యేకించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో 1977 తర్వాత ఒక్క మేజర్ రిఫైనరీ కూడా ఎందుకు రాలేదో తెలుసా.. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటంటే.. కొత్త ప్లాంట్ను నిర్మించడం కంటే, ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడమే లాభదాయకమని అమెరికన్ కంపెనీలు భావించాయి. కొత్త రిఫైనరీని స్థాపించడానికి అమెరికాలో ప్రభుత్వ అనుమతులు పొందడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. రాబోయే కాలంలో గ్యాసోలిన్ (పెట్రోల్) డిమాండ్ తగ్గుతుందని, ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతుందని కంపెనీలు ఊహించాయి. అందుకే 50 ఏళ్లుగా అమెరికా కొత్త ఆయిల్ రిఫైనరీల వైపు మొగ్గు చూపలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
చివరిసారిగా 1977లో లూసియానాలో మారథాన్ ఆయిల్ పెద్ద రిఫైనరీని ప్రారంభించింది. ఆ తర్వాత కేవలం చిన్న చిన్న ప్లాంట్లు మాత్రమే వచ్చాయి. అయితే, 2022లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని అమెరికా గుర్తించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. రిలయన్స్ వంటి గ్లోబల్ ఎనర్జీ ప్లేయర్ ఈ ప్రాజెక్టులో చేరడం వల్ల అమెరికాలో ఇంధన ధరలు తగ్గడమే కాకుండా, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది అటు అమెరికాకు, ఇటు భారతీయ వ్యాపార రంగానికి కొత్త ఊపును తీసుకొచ్చే ఒప్పందంగా మారనుందని చెబుతున్నారు.
READ ALSO: Chota K Naidu: సినిమాకు కులం లేదు: ఛోటా కే.నాయుడు
తాజావార్తలు
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..