AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రాబోయే 30 ఏళ్ల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని..
- స్మార్ట్ ఇండస్ట్రీస్, విమానాశ్రయం, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్..
- స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం..
- భూమికి విలువ రావాలంటే పరిశ్రమలు, ఐటి పార్కులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవసరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్ ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. భారీ పెట్టుబడులకు, స్మార్ట్ ఇండస్ట్రీస్కు మార్గం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. రాబోయే 30 ఏళ్ల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ ఇండస్ట్రీస్, విమానాశ్రయం, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. భూమికి నిజమైన విలువ రావాలంటే పరిశ్రమలు, ఐటి పార్కులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవసరం ఉందని పేర్కొన్నారు.
Read Also: Local Body Elections : ఎస్సీ రిజర్వేషన్ జాక్పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
ఇక, ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు నారాయణ.. రాజధానిలో ముందుగా చేపట్టిన వ్యవస్థ ప్రకారం 16,666.75 ఎకరాల ల్యాండ్ పూలింగ్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేపడతామని, ముందుగా ఇచ్చిన అన్ని ప్రయోజనాలు మళ్లీ యథావిధిగా వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం సమీకరించబోయే భూముల్లో.. ఎయిర్పోర్ట్ – 5,000 ఎకరాలు, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
కేంద్ర బ్యాంకుల పెట్టుబడులతో అమరావతి ఆకర్షణ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 15 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ల శంఖుస్థాపన చేసిన విషయం అమరావతికి ఆర్థిక హబ్గా గుర్తింపు వస్తోందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. అమరావతిలో యూనివర్సిటీలు, హోటల్ ప్రాజెక్టులు, రవాణా సదుపాయాలు వంటి మౌలిక వసతులకు ఇప్పటికే భూములు కేటాయించినట్టు తెలిపారు. మొత్తంగా అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగు పడినట్టు అయ్యింది.. 16,666 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ఆమోదం లభించగా.. రైతులకు పాత ప్రయోజనాలే కొనసాగించనున్నారు.. స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్లు, రైల్వే స్టేషన్ ప్రణాళిక రూపొందిస్తున్నారు..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!