AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రాబోయే 30 ఏళ్ల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని..
- స్మార్ట్ ఇండస్ట్రీస్, విమానాశ్రయం, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్..
- స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం..
- భూమికి విలువ రావాలంటే పరిశ్రమలు, ఐటి పార్కులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవసరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్ ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. భారీ పెట్టుబడులకు, స్మార్ట్ ఇండస్ట్రీస్కు మార్గం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. రాబోయే 30 ఏళ్ల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ ఇండస్ట్రీస్, విమానాశ్రయం, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. భూమికి నిజమైన విలువ రావాలంటే పరిశ్రమలు, ఐటి పార్కులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవసరం ఉందని పేర్కొన్నారు.
Read Also: Local Body Elections : ఎస్సీ రిజర్వేషన్ జాక్పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ఇక, ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు నారాయణ.. రాజధానిలో ముందుగా చేపట్టిన వ్యవస్థ ప్రకారం 16,666.75 ఎకరాల ల్యాండ్ పూలింగ్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేపడతామని, ముందుగా ఇచ్చిన అన్ని ప్రయోజనాలు మళ్లీ యథావిధిగా వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం సమీకరించబోయే భూముల్లో.. ఎయిర్పోర్ట్ – 5,000 ఎకరాలు, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
కేంద్ర బ్యాంకుల పెట్టుబడులతో అమరావతి ఆకర్షణ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 15 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ల శంఖుస్థాపన చేసిన విషయం అమరావతికి ఆర్థిక హబ్గా గుర్తింపు వస్తోందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. అమరావతిలో యూనివర్సిటీలు, హోటల్ ప్రాజెక్టులు, రవాణా సదుపాయాలు వంటి మౌలిక వసతులకు ఇప్పటికే భూములు కేటాయించినట్టు తెలిపారు. మొత్తంగా అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగు పడినట్టు అయ్యింది.. 16,666 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ఆమోదం లభించగా.. రైతులకు పాత ప్రయోజనాలే కొనసాగించనున్నారు.. స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్లు, రైల్వే స్టేషన్ ప్రణాళిక రూపొందిస్తున్నారు..
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!