Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prepaid Electricity System: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల్లో విద్యుత్ వినియోగం, బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు బకాయిల సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీపెయిడ్ విధానం ద్వారా అవసరమైన మేరకు ముందుగానే రీచార్జ్ చేసుకుని విద్యుత్ వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ కొత్త వ్యవస్థతో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడంతో పాటు విద్యుత్ పొదుపు చేయడం, బిల్లుల భారం తగ్గించుకోవడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే వినియోగదారుల్లో బాధ్యతాయుతమైన విద్యుత్ వినియోగంపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులన్నింటినీ వివిధ గ్రూపులుగా విభజించి ప్రత్యేక వాలెట్ వ్యవస్థ ద్వారా రీచార్జ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులపై సంబంధిత శాఖలకు పూర్తి నియంత్రణ ఉండటంతో పాటు ఖర్చుల లెక్కలు మరింత స్పష్టంగా అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ప్రీపెయిడ్ విధానం అమలులో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) ముందంజలో ఉంది. సీపీడీసీఎల్ పరిధిలో మొత్తం 71,174 ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా, వాటిలో సుమారు 50 వేల సర్వీసులను నేటి నుంచి ప్రీపెయిడ్ విధానంలోకి మార్చారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో మొత్తం 1.17 లక్షల ప్రభుత్వ సర్వీసులు ఉండగా, అందులో 34,496 సర్వీసులను ఇప్పటికే ప్రీపెయిడ్ విధానంలోకి తీసుకువచ్చారు.
అలాగే తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు ఉండగా, ప్రస్తుతం వాటిలో నాలుగో వంతు సర్వీసులు మాత్రమే ప్రీపెయిడ్ విధానంలోకి మారినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం, బిల్లుల బకాయిల సమస్యను నివారించడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ ప్రీపెయిడ్ విద్యుత్ విధానం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా విస్తరించనుంది.
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!