PVN Madhav: ఇది చారిత్రాత్మకం.. జై అమరావతి.. జై జై అమరావతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVN Madhav: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. “జై అమరావతి.. జై జై అమరావతి” అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయానికి వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని, అనేక మంది కృషి ఫలితమే ఈ రోజు సాధ్యమైందని అన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో గొప్పదని తెలిపారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత సాధించే ప్రయాణంలో ప్రతి ఒక్కరి సహకారం కీలకమైందని, అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేశారు.
Also Read
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి అమరావతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని మాధవ్ అభినందించారు. 2019 నుంచి 2024 వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా రాజధాని కోసం ఆయన చేసిన పోరాటం ప్రశంసనీయమని అన్నారు. దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా చట్టబద్ధత తీసుకురావడం జరగలేదని, పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. అమరేశ్వరుడి ఆశీర్వాదాలు అమరావతిపై ఉన్నాయని, భవిష్యత్తులో ఇది దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గొప్ప రాజధానిగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. అమరావతి పునాది వేయడం నుంచి ఇప్పటి వరకు రాజధానికి అండగా నిలిచారని ఆయన గుర్తుచేశారు. శంకుస్థాపన సమయంలో దేశవ్యాప్తంగా పవిత్ర జలాలు, మట్టిని తీసుకురావడం ద్వారా ప్రతి భారతీయుడిని ఈ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రాజధాని ఎంపిక కమిటీలో సభ్యుడిగా పనిచేసే అవకాశం రావడం గర్వకారణమని చెప్పారు. మొత్తంగా, అమరావతి చరిత్ర దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా అభివృద్ధి చెందుతుందని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?