Amaravati Capital Construction: రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం..
- రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం..
- హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ..
- ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించిన మంత్రి..
- B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనం గా హై కోర్టు నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Construction: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. రాజధానిలో ఐకానిక్ భవనంగా నిర్మించనున్న హైకోర్టు భవనానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ (Raft Foundation) పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లతో కలిసి రాఫ్ట్ ఫౌండేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
అమరావతిలో హైకోర్టు భవనాన్ని B+G+7 (బేస్మెంట్ + గ్రౌండ్ + 7 అంతస్తులు) మోడల్లో అత్యాధునిక, ఆకర్షణీయ, ఐకానిక్ డిజైన్తో నిర్మించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Norman Foster and Partners రూపొందించిన డిజైన్ ఆధారంగా ఈ నిర్మాణం కొనసాగనుంది. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాల్స్తో కూడిన ఈ హైకోర్టు భవనం, రాష్ట్ర న్యాయవ్యవస్థకు కొత్త గుర్తింపుగా నిలవనుంది. అంతస్తుల వారీగా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు..
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు.. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు.. భవన నిర్మాణంలో మొత్తం 45,000 టన్నుల స్టీల్ వినియోగిస్తున్నారని తెలిపారు.. మొత్తం 52 కోర్టు హాల్స్తో నిర్మాణం జరగనుంది అన్నారు.. ఇక, అమరావతి హైకోర్టు నిర్మాణాన్ని 2027 చివరికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పండుగల అనంతరం కూడా నిర్మాణ పనులు వేగం తగ్గకుండా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు, అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. రాజధానిలో మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా తీర్చిదిద్దుతున్నాం. Norman Foster and Partners ఇచ్చిన ప్రపంచస్థాయి డిజైన్తో ఈరోజు హైకోర్టు పనులు ప్రారంభించాం. ఇది ఏపీ న్యాయవ్యవస్థకు భవిష్యత్తు ల్యాండ్మార్క్.గా అభివర్ణించారు. హైకోర్టు భవనం 21 లక్షల చ.అ. విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్తో నిర్మించబడుతోంది. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది అన్నారు.. భవన నిర్మాణానికి మొత్తం 45,000 టన్నుల స్టీల్ వినియోగిస్తున్నాం. 2027 చివరికి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వం చేసిన అవకతవకల కారణంగా అమరావతి పనులు ఆలస్యం అయ్యాయి. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా పారదర్శకంగా, వేగంగా పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
-
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
-
HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..