Heavy Rains and Floods in AP: ఏపీలో 19 మంది మృతి.. ఇద్దరు గల్లంతు..
- ఏపీలో భారీ వర్షాలు.. వరదలు..
- ఇప్పటి వరకు 19 మంది మృతి.. ఇద్దరు గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains and Floods in AP: భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి.. ఇంకా వర్షం ముప్పు పొంచిఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం.. పంట నష్టం.. ఇతర విషయాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఓ ప్రకటన విడుదల చేసింది.. రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది.
Read Also: AP and Telangana Rains LIVE UPDATES: వరుణుడి ప్రతాపం.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
మరోవైపు.. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 1,808 కిలో మీటర్ల పొడువున ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నట్టు పేర్కొంది కమాండ్ కంట్రోల్ రూమ్.. ఇక, 1,72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగిపోయాయని తెలిపింది.. ప్రకాశం బ్యారేజీ వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.. 41,927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించాం.. 171 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని.. సహాయక చర్యల్లో 36 NDRF, SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నారని పేర్కొంది. బాధితులకు ఈ రోజు 3 లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నాం.. 188 బోట్లును, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం.. ఎటువంటి సహాయనికైన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.. ఇక, ముంపు భాదిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది.. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేశారు.. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం ఉందని వెల్లడించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!