Tribals Protest: హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్రరూపం.. సర్వే రాళ్లు ధ్వంసం..
- హైడ్రోపవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం..
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆందోళనకు దిగిన గిరిజనులు..
- అరకులోయ మండలం లోతేరులో సర్వే రాళ్లు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tribals Protest: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రోపవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. అరకులోయ మండలం లోతేరులో సర్వే రాళ్లను ధ్వంసం చేశారు గిరిజనులు.. తమ సంప్రదాయ ఆ యుధాలతో ప్రదర్శన నిర్వహించారు. పవర్ ప్లాంట్లను తరిమి కొడతామని హెచ్చరించడంతో ఏజెన్సీ నివురుగప్పింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
ఇంతకాలం కొండకోనలను నమ్ముకుని ధైర్యంగా బ్రతికేస్తున్న ఆదివాసీల్లో హైడ్రో పవర్ ప్లాంట్స్ ఒణుకు పుట్టిస్తున్నాయి. భూములు, గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తే ఉనికికే ప్రమాదం అనే ఆందోళన మొదలైంది. అనంతగిరి, అరకు, కొయ్యూరు మండలాల పరిధిలో 7 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్టు ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి.. గతంలో ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన యంత్రాంగం మళ్లీ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధం కావడంతో పోరాటానికి రెడీ అంటున్నాయి ఇక్కడ గ్రామాలు. జీవో నంబర్ 51 రద్దు కోసం డిమాండ్ చేస్తున్న గిరిజనులు.. ప్రభావిత ప్రాంతాల్లోకి సర్వే బృందాలు అడుగు పెడితే తిప్పికొడతామని హెచ్చరిస్తున్నాయి.
Read Also: War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
హైడ్రో పవర్ ప్లాంట్స్ నిర్మాణం పేరుతో ఆదివాసీ గ్రామాల ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు హెచ్చరిస్తున్నాయి. గిరిజనుల ఆందోళనకు వైసీపీ మద్దతు ప్రకటించింది. 1/70, పీసా వంటి చట్టాలు అమలులో ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేసే విధంగా యాక్షన్ ప్లాన్ కనిపిస్తోందోనే ఆందోళన ఎక్కువయింది. సర్వేల కోసం గ్రామాల్లోకి వస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో వ్యతిరేకత నేపథ్యంలో హైడ్రో పవర్ ప్లాంట్స్ పై ఎలా ముందుకు వెళ్లాలనే సందిగ్ధంలో యంత్రాంగం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!