Chhattisgarh: ఛత్తీస్గఢ్కి హిడ్మా మృతదేహం తరలింపు..
- హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తరలింపు..
- సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో హిడ్మా అంత్యక్రియలు..
- మరో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు కొనసాగుతున్న పోస్టుమార్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా మృతదేహం ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి తరలించారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో గత రాత్రి హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలు బంధువులకు అప్పగించారు. హిడ్మా స్వగ్రామం ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, హిడ్మా పోస్టుమార్టంలో ఆయన సోదరుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Also: The Raja Saab: సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’.. ఓవర్సీస్లోనే ముందే సంచలన బుకింగ్స్!
Also Read
అయితే, మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, పీఎల్డీఏ ఒకటో బెటాలియన్ కమాండెంట్ మడావి హిడ్మా ఈనెల 18న మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. అలాగే, ఈనెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి దగ్గర రెండు వరస ఎన్ కౌంటర్లలో మరో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇంత వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయగా.. మిగిలిన ఏడు మావోయిస్టులు మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. పోస్టుమార్టం నిర్వహిస్తున్న రంపచోడవరం ఏరియా హాస్పిటల్ మార్చురీ దగ్గర భారీగా భద్రత దళాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం పూర్తైన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!