Air India: మరోసారి ఎయిర్ఇండియా విమానానికి తప్పిన భారీ ముప్పు..!
- విశాఖ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పెను ప్రమాదం తప్పిన ఎయిర్ ఇండియా విమానం
- ఇంజిన్ రెక్కల్లో ఇరుక్కున్న పక్షి – ఫ్యాన్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి
- పైలట్ల అప్రమత్తతతో సురక్షిత ల్యాండింగ్, ప్రయాణికులందరూ క్షేమం
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఎయిర్ ఇండియా, ఘటనపై విచారణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు చాకచక్యంగా దాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. మధ్యాహ్నం 2:20 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్కు 103 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానం రెక్కల్లో ఒక పక్షి ఇరుక్కుంది. దీని కారణంగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఈ సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి తిప్పారు. సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత విమానంలోని ప్రయాణికులందరినీ దించివేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిర్ లైన్స్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఘటనపై విమానయాన సంస్థ విచారణ చేపట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Ilaiyaraaja : చుక్కలు చూపిస్తున్న ఇళయరాజా.. మరీ ఇంత అవసరమా..?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!