Adivasi Divas: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతిని కాపాడుకోవడంలో పాటు విద్య వైద్యం అవసరం అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పాడేరులో వైద్య కళాశాల మంజూరు చేశారు.
విద్య విషయంలో నాడు నేడు కింద ఈ ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది. గిరిజనుల్లో నాయకత్వాన్ని పెంచి గుర్తింపు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలు ఆదివాసీల కోసమే అన్నారు. వారికోసం ప్రత్యేకంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాకముందు కూడా గిరిజనుల కోసం పాటు పడిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భూయాజమన్య హక్కులను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజనులకు అందించారు.
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఈ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ప్రభుత్వం. ప్రతి సంక్షేమ ఫలాలను గిరిజనులకు అందిస్తున్నారు. పోడు భూముల హక్కులను కల్పిస్తూ అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు హనుమంతు నాయక్ గిరిజనుల కోసం జగన్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. గిరిజన హక్కులను కాపాడే దిశగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు. చంద్రబాబు గిరిజనుల హక్కులను అణచివేసిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు వైఎస్ జగన్ చేశారు. గిరిజనులను డిప్యూటీ సీఎం గా చేశారు. అర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి గిరిజనులకు మేలుచేసిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?