Adivasi Divas: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతిని కాపాడుకోవడంలో పాటు విద్య వైద్యం అవసరం అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పాడేరులో వైద్య కళాశాల మంజూరు చేశారు.
విద్య విషయంలో నాడు నేడు కింద ఈ ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది. గిరిజనుల్లో నాయకత్వాన్ని పెంచి గుర్తింపు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలు ఆదివాసీల కోసమే అన్నారు. వారికోసం ప్రత్యేకంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాకముందు కూడా గిరిజనుల కోసం పాటు పడిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భూయాజమన్య హక్కులను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజనులకు అందించారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ఈ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ప్రభుత్వం. ప్రతి సంక్షేమ ఫలాలను గిరిజనులకు అందిస్తున్నారు. పోడు భూముల హక్కులను కల్పిస్తూ అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు హనుమంతు నాయక్ గిరిజనుల కోసం జగన్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. గిరిజన హక్కులను కాపాడే దిశగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు. చంద్రబాబు గిరిజనుల హక్కులను అణచివేసిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు వైఎస్ జగన్ చేశారు. గిరిజనులను డిప్యూటీ సీఎం గా చేశారు. అర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి గిరిజనులకు మేలుచేసిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!