Dance in ClassRoom: క్లాస్ రూమ్లో డ్యాన్స్లు.. 8 మంది విద్యార్థులపై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్లాస్ రూమ్లో సరదాగా ఉండాలి, లెక్చరర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి.. లెక్చరర్ లేని సమయంలో.. క్లాస్రూమ్లో అల్లరి చేయడం ఎక్కడైనా జరిగే తంతుయే కావొచ్చు.. కానీ, అది ఏ మాత్రం శృతిమించకూడదు.. విద్యార్థుల భవిష్యత్పై దాని ప్రభావం పడుతోంది.. ఇప్పుడు కాకినాడలో అదే జరిగింది.. క్లాస్రూమ్లో పిచ్చి డ్యాన్స్లు వేయడమే కాదు.. ఆ వీడియోను సెల్ఫోన్లో చిత్రీకరించారు.. ఒక్కరు, ఇద్దరు.. ఆ తర్వాత ముగ్గురు.. ఆ తర్వాత పెద్ద గ్యాంగ్ ఇలా.. అంతా చేరి పిచ్చి స్టెప్పులు వేసింది.. ఆ వీడియో కాస్తా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో.. ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.. ఆ విషయం తల్లి దండ్రుల వరకు వెళ్లడంతో.. విద్యార్థుల భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్లాస్ రూమ్లో కొందరు విద్యార్థులు.. పిచ్చి చేష్టలు చేశారు.. ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేశారు.. చూసేవారికే ఆ స్టెప్పులు ఇబ్బంది కరంగా ఉన్నాయి.. ఆ స్టెప్పులను వీడియో చిత్రీకరించడంతో.. అది కాస్తా యాజమాన్యం వరకు వెళ్లింది.. దీంతో, 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం.. అయితే, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థులు.. వారం గడిచినా.. ప్రతీరోజు కాలేజీకి వెళ్లి వస్తూనే ఉన్నారు.. దీనిపై విద్యార్థులను సస్పెండ్ చేసి తొమ్మిది రోజులు అవుతున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు కాలేజ్ కి వెళ్లి తిరిగి వస్తున్నారని, వారు మానసికక్షోభకి గురవుతున్నారని.. విద్యార్థి తల్లి వాయిస్ మెసేజ్ ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది.. పిల్లలు ఏమైనా చేసుకుంటే కాలేజ్ యజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
తాజావార్తలు
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!