NTV Telugu Site icon

Pet Dog: నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.. కుక్క కాటుకు యువకుడు మృతి

Pet Dog

Pet Dog

కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.

PM Modi: స్పీకర్ ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు..

కాగా.. గత నాలుగేళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానికి ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించడం మరవడంతో కొద్దిరోజుల క్రితం కుమారుడు భార్గవ్ ను అతని తల్లిని కరిచింది. తల్లికి వ్యాక్సిన్ వేయించి.. తాను మాత్రం వ్యాక్సిన్ వేసుకోలేకపోయాడు. దీంతో.. పెరాలసిస్ తో బాధపడుతున్న తన తండ్రికి ఓ వైపు హాస్పిటల్ చికిత్స విషయంలో బిజీగా ఉండి చివరకు తన ప్రాణాలు మీదకు తెచ్చుకొని చనిపోయాడు. అటు పెరాలిసిస్తో కన్నతండ్రి, పెంచుకున్న కుక్క కరవడంతో కన్న కొడుకు, చివరకు కరిచిన కుక్క చనిపోవడంతో కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Parliament: లోక్‌సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్.. వీడియో..