Vande Bharat :సెల్ఫీ తెచ్చిన తంటా.. ఫోటో కోసం రైలెక్కి బుక్కయ్యాడు
Vande Bharat : ‘కొత్తక వింత పాత ఒక రోత’ అన్న సామెత ఈ వార్తకు అతికినట్లు సరిపోతుంది. వారం రోజులుగా వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు పెడుతోంది. దీంతో ఒక్కసారైనా ట్రైన్ ఎక్కాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే.. ట్రైన్ ఎక్కకపోయినా చూద్దామని చాలా మంది స్టేషన్లకు తరలివస్తున్నారు. లోపలికి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అలా ఫొటో కోసం ఎక్కిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఫలితంగా గంటల పాటు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Sky Walk: ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇబ్బంది ఉండదు.. త్వరలో అందుబాటులోకి స్కై వాక్
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
విశాఖపట్నం నుంచి వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ వస్తోంది. ఈ మార్గంలో రాజమండ్రిలో ఆగింది. ఆ సమయంలో.. ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుందామని ట్రైన్ ఎక్కాడు. ఆయన ఫొటోలు దిగే సంబరంలో ఉండగా.. ఉన్నట్లుండి డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి. కిందకు దిగుదామని ఎంత ట్రై చేసినా.. ఫలితం లేకపోయింది. దీంతో సదరు వ్యక్తి రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ట్రైన్లోనే ఉండిపోయారు. ట్రైన్ విజయవాడ వచ్చాక దిగి మళ్లీ రాజమండ్రి వెళ్లారు. అయితే.. అతనికి ట్రైన్ సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. మరో 550కోట్లు విడుదల చేసిన సర్కార్
వందేభారత్ రైళ్లు మామూలు ట్రైన్స్ లాంటివి కాదు. ఇందులో ఆధునిక టెక్నాలజీ ఉంది. డోర్స్ ఆటోమెటిక్గా మూసుకుపోతాయి. ప్రధాన స్టేషన్లలోనూ 2 నిమిషాలకు మించి ఆగదు. అలా ఎక్కి ఫొటో తీసుకుని, ఇలా వచ్చేద్దామంటే కుదరదు. ఎక్కేవారు దిగే ప్రయాణికులతో ట్రైన్ ద్వారాలు బిజీగా ఉంటాయి. హడావుడిలో ఫొటోల కోసం ఎక్కితే బుక్ అయిపోతారు. అనవసరంగా వందేభారత్ ఎక్కితే, రైల్వే టీసీలు రూ.10వేల దాకా పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంది. అందుకే టికెట్ ఉంటేనే వందేభారత్ ఎక్కాలి. లేదంటే బయట నుంచే చూడాలని రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో