Child Trafficking: విశాఖలో చైల్డ్ రాకెట్.. ఆసుపత్రిలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అమ్మకాలు..!
- విశాఖలో సంచలనం రేపుతున్న చైల్డ్ రాకెట్..
- ఆస్పత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే నిందితులపై పోలీసుల నజర్..
- ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశాం: విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్. బాగ్చీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Trafficking: విశాఖపట్నంలో చైల్డ్ రాకెట్ సంచలనంగా మారుతుంది. ఆసుపత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లక్షల రూపాయలకు అమ్మేస్తున్నాయి ఘరానా ముఠాలు. కొన్ని కేసుల్లో బంధువులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంగా ఉండటంతో మరింత కలవర పాటుకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం సిరిపురం ఏరియాలో చిన్నారిని అమ్మకానికి పెట్టినట్టు టాస్క్ ఫోర్స్ కు సమాచారం వచ్చింది. దీని ఆధారంగా రైడ్ చేస్తే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 8 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్టు గుర్తించారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మరో శిశువును అమ్మకానికి పెట్టిన సమాచారంతో రెస్క్యూ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలను కాపాడగా.. 10 మంది అరెస్ట్ అయ్యారు అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చీ పేర్కొన్నారు.
Read Also: BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
అలాగే, శిశు మాఫియా మూలాలను కనిపెట్టేందుకు ప్రత్యే క బృందాలను రంగంలోకి దించారు సిటీ పోలీసు కమిషనర్ బాగ్చీ. అంతర్ రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు ఒడిశా, కడప, అనకాపల్లి వంటి ప్రాంతాలకు టీంలు వెళ్ళాయి.. వరుస ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.. కేజీహెచ్, ఘోషా ఆసుపత్రి సహా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నిఘా పెంచారు అని ఆయన చెప్పుకొచ్చారు. సిటీ పరిధిలోని 80 ఆసుపత్రులలో లోపాలను గుర్తించాం.. తల్లీ, బిడ్డల రక్షణకు అవసరమైన ఏర్పాట్లలో వైఫల్యాలను సరిదిద్దాలని, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని నిర్ధారణ అయింది అన్నారు. చైల్డ్ మిస్సింగ్ కేసులతో పాటు వివిధ ఆసుపత్రుల నుంచి అపహరణకు గురైన వాటిని మొత్తం క్రోడీకరించి ఒక లాజికల్ కన్ క్ల్యూజన్ కు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!