Child Trafficking: విశాఖలో చైల్డ్ రాకెట్.. ఆసుపత్రిలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అమ్మకాలు..!
- విశాఖలో సంచలనం రేపుతున్న చైల్డ్ రాకెట్..
- ఆస్పత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే నిందితులపై పోలీసుల నజర్..
- ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశాం: విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్. బాగ్చీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Trafficking: విశాఖపట్నంలో చైల్డ్ రాకెట్ సంచలనంగా మారుతుంది. ఆసుపత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లక్షల రూపాయలకు అమ్మేస్తున్నాయి ఘరానా ముఠాలు. కొన్ని కేసుల్లో బంధువులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంగా ఉండటంతో మరింత కలవర పాటుకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం సిరిపురం ఏరియాలో చిన్నారిని అమ్మకానికి పెట్టినట్టు టాస్క్ ఫోర్స్ కు సమాచారం వచ్చింది. దీని ఆధారంగా రైడ్ చేస్తే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 8 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్టు గుర్తించారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మరో శిశువును అమ్మకానికి పెట్టిన సమాచారంతో రెస్క్యూ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలను కాపాడగా.. 10 మంది అరెస్ట్ అయ్యారు అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చీ పేర్కొన్నారు.
Read Also: BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
అలాగే, శిశు మాఫియా మూలాలను కనిపెట్టేందుకు ప్రత్యే క బృందాలను రంగంలోకి దించారు సిటీ పోలీసు కమిషనర్ బాగ్చీ. అంతర్ రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు ఒడిశా, కడప, అనకాపల్లి వంటి ప్రాంతాలకు టీంలు వెళ్ళాయి.. వరుస ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.. కేజీహెచ్, ఘోషా ఆసుపత్రి సహా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నిఘా పెంచారు అని ఆయన చెప్పుకొచ్చారు. సిటీ పరిధిలోని 80 ఆసుపత్రులలో లోపాలను గుర్తించాం.. తల్లీ, బిడ్డల రక్షణకు అవసరమైన ఏర్పాట్లలో వైఫల్యాలను సరిదిద్దాలని, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని నిర్ధారణ అయింది అన్నారు. చైల్డ్ మిస్సింగ్ కేసులతో పాటు వివిధ ఆసుపత్రుల నుంచి అపహరణకు గురైన వాటిని మొత్తం క్రోడీకరించి ఒక లాజికల్ కన్ క్ల్యూజన్ కు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చీ వెల్లడించారు.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!