Godavari Floods: మునిగిన కూనవరం బ్రిడ్జి.. ఆరు జిల్లాల పరిధిలో 1,79,668 మంది వరద బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉభయగోదావరి జిల్లాలలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కూనవరం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరుగులు తీస్తోంది. ఇప్పటికే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయగా.. ప్రజలు కాలినడకన బ్రిడ్జి దాటుతున్నారు. అటు గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. 24 గంటల పాటు గోదావరి ప్రవాహం.. వరద ముంపును మానిటర్ చేస్తోంది. ఇప్పటి వరకు గోదావరి వరద బారిన పడ్డ ఆరు జిల్లాల పరిధిలో 1,79,668 మంది వరద బాధితులు ఉన్నట్లు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.
Read Also: Hyderabad: గజగజ వణికిన హైదరాబాద్. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఆరు జిల్లాల పరిధిలోని 42 మండలాలు, 280 గ్రామాల ఉండగా గోదావరి వరద ఉధృతికి 175 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అటు భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టగా.. కూనవరం, పోలవరం, ధవళేశ్వరం వద్ద మాత్రం వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద క్రమంగా పెరగవచ్చని.. 28 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల మేర వరద ధవళేశ్వరానికి చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలీఫ్ క్యాంపుల్లో అందుతోన్న సేవలను స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మానిటర్ చేస్తోంది. ఆరు జిల్లాల పరిధిలో 156 రిలీఫ్ క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 70 వేల మందిని రిలీఫ్ క్యాంపులకు ప్రభుత్వం తరలించింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!