రేపు అమరావతి ఐకాస చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఐకాస రేపు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు తలపెట్టారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి సిద్ధమయ్యారు. కాగా కొవిడ్ దృష్ట్యా ర్యాలికి అనుమతి సాధ్యం కాదని డీఐజీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అనుమతులు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. 50 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని.. ఎవరికి వారు శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చు అని తెలిపారు. రెండు వర్గాల ర్యాలీతో శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. గొడవలు జరిగే అవకాశం ఉందని మాకు నిఘా వర్గాల సమాచారం అందింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అనుమతి ఇవ్వము. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని డీఐజీ త్రివిక్రమ వర్మ హెచ్చరించారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..