ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీయనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరుపార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కాంగ్రెస్ కు కొత్త దారిని చూపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలో నయా జోష్ కన్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది.
పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తిరిగి ఇక్కడ అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం అభ్యర్థిని సైతం మార్చివేసింది. ప్రతిపక్షాల ప్లాన్ ను ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ అందుకు తగ్గటుగానే ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ ను సీఎం చేసింది. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆపార్టీలో నెలకొన్న అధిపత్య పోరు ఆపార్టీని ఇరుకునపెడుతోంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేలా అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమాత్రం లేకుండా చూడాలని భావిస్తోంది. అయితే అధిష్టానం ప్రయత్నాలు బెడిసి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణమాలన్నీ కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మాత్రం కాంగ్రెస్ బలపడుతుండటం బీజేపీకి మైసస్ గా మారుతోంది.
ఉత్తరప్రదేశ్ లో ఓ కేంద్ర మంత్రి కుమారుడు రైతులపై కారును ఎక్కించి నలుగురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై యోగీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బీజేపీకి మైనస్ గా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు రైతుల పక్షాన పోరాడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక చట్టాలు చేస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరుగడం బీజేపీని మరింత ఇరుకున పెడుతోంది.
ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచే ఆపార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గడిచిన నాలుగేళ్లలో ఇక్కడ ముగ్గురు సీఎంలను బీజేపీ మార్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కన్పిస్తుంది. అధిష్టానం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఓ మంత్రి బీజేపీకి రాజీనామా చేసి తన కుమారుడితో సహా కాంగ్రెస్ లో చేరారు.
సదరు మంత్రి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యే, మంత్రులు బీజేపీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులన్నీ కూడా బీజేపీకి మైనస్ గా మారుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీలో పుట్టిన ముసలం కాంగ్రెస్ కు అనుకూలంగా మారేలా కన్పిస్తున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గాలి వీస్తుందా? అనే చర్చ సైతం జోరుగా నడుస్తోంది. ఈ పరిస్థితుల నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!