Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Crisis In Tdp Senior Leaders Leaving The Party

టీడీపీకి సీనియర్ల గుడ్ బై.. అసలు ఏం జరుగుతుంది?

Published Date :September 25, 2021 , 12:20 pm
By Lakshmi Narayana
టీడీపీకి సీనియర్ల గుడ్ బై.. అసలు ఏం జరుగుతుంది?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టీడీపీకి ప్రతిపక్షంలో ఉండటం.. అధికారంలోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని దశాబ్ధాలుగా ఆపార్టీ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన టీడీపీ ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. అయితే గత ఓటమి నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదని ఆపార్టీ నేతల వైఖరి చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీనికితోడు టీడీపీ సీనియర్లంతా వరుసబెట్టి గుడ్ బై చెబుతున్నారు. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ఏంటనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఐదేళ్లపాటు ఏపీని పరిపాలించారు. తానే ఏపీకీ ఎప్పటికీ సీఎంగా ఉంటానన్న రేంజులో కలరింగ్ ఇచ్చారు. దీంతో ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన రాజధానికి కూడా గాలికొదిలేశారన్న విమర్శ ఉంది.. చేయాల్సిన అభివృద్ధి పనులన్నీ నత్తనడకగా సాగించారు. దీంతో ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వైఎస్ జగన్ ఇమేజ్ కు తోడు టీడీపీ వ్యతిరేకత తోడవడంతో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

Also Read

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
  • Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
  • love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
  • Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
Add as a preferred
source on google

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఏజెండాగా పని చేస్తూ ముందుకెళుతున్నారు. ఆయన పాలనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కన్పించడం లేదు. దీనికితోడు టీడీపీ నేతలు కరోనా సాకుతో ఇంటికే పరిమితమై పోతున్నారు. ప్రజా సమస్యలపై పెద్దగా పోరాడిన దాఖలాల్లేవు. మరోవైపు ప్రభుత్వంపై గట్టిగా గళం విప్పిన నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. దీంతో మెజార్టీ నేతలు సైలంటైపోతున్నారు. మరోవైపు బాబు తన వయస్సు పైబడటంతో తన కుమారుడిని లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన లోకేష్ నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ సీనియర్లు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

ఈ కారణంగానే చాలామంది సీనియర్లు ఆపార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందే కేఈ కృష్ణమూర్తి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన చంద్రబాబు నాయుడికి సమకాలీకుడు. బాబు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుండగా ఆయన మాత్రం అస్త్రసన్యాసం చేశారు. దీంతో గత ఎన్నికల్లో ఆయన కుమారుడు శ్యాంబాబుకు పత్తికొండ అసెంబ్లీ సీటును ఇచ్చారు. అయితే జగన్ వేవ్ ముందు ఆయన ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇప్పుడు ఆపార్టీలో ఎంతమంది చంద్రబాబుతో ఉన్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి, గల్లా అరుణ కుమారిలు సైతం ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే వీరి కుమారులు మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని, తన టిక్కెట్ ఎవరికైనా ఇచ్చుకోండి అంటూ ఆయన నేరుగా చంద్రబాబుకే చెప్పినట్లు తెలుస్తోంది. తనపై ఆరోపణలు చేసిన బుద్దా వెంకన్న, బొండా ఉమలపై బాబు చర్యలు తీసుకోకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా టీడీపీ నేతలు పలు కారణాలను సాకుగా చూపుతూ ఇటీవల కాలంలో ఆపార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో ఈ పార్టీకి భవిష్యత్ లేదనే నేతలు ముందుగానే సైడ్ పోతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారనేది ఆసక్తిని రేపుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • tdp

తాజావార్తలు

  • Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఫైర్!

  • Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..

  • Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’

  • Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions