జనసేనను కాదని బీజేపీ బరిలో నిలుస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన సైతం బద్వేల్ లో బరిలో నిలుస్తుందని జోరుగా ప్రచారం సాగింది.
కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మాటల తూటాలు పేలుస్తుండటంతో వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు. ఈక్రమంలోనే జనసేన-వైసీపీ నేతల మధ్య అగ్గిరాజుకుంది. ఒకరిపై ఒకరు భౌతికదాడులు, ప్రతివిమర్శలు దిగడంతో వార్ షూరు అయ్యింది. కాగా నిన్న జరిగిన రాజమండ్రి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
బద్వేల్ బై ఎలక్షన్ నుంచి జనసేన తప్పుకుంటుందని ప్రకటించారు. అధికార వైసీపీ మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే టిక్కెట్ కేటాయించిన నేపథ్యంలో జనసేన పోటీకి దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసేలా చూడాలన్నారు. దీంతో ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగుతుందని అంతా భావించినా జనసేన తప్పుకోవడంతో అలాంటిదేమీ ఉండదని క్లారిటీ వచ్చేసింది. అయితే జనసేన తప్పుకున్నా ఇక్కడ పోటీ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేసుకుంటోంది.
జనసేన మద్దతు బీజేపీ ఇక్కడ పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తున్నాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పోటీ నుంచి తప్పుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇవ్వకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది. దీంతో వీరి బంధానికి బద్వేల్ ఉపఎన్నిక సాక్షిగా బీటలు వారే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటీకే ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
తిరుపతి బై ఎలక్షన్ తర్వాత జనసేన, బీజేపీలు ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఎవరికీ వారు ఒంటిరిగానే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. పవన్ ఇచ్చిన కార్యక్రమాలకు బీజేపీ నుంచి మద్దతు లభించడం లేదు. అలాగే పవన్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా ఆపార్టీ పెద్దగా స్పందించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది.
తాజాగా జనసేన బద్వేల్ లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ కావడంతో ఇక్కడ బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే బీజేపీకి జనసేనాని మద్దతు ఇస్తారా? లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వీరి బంధానికి బద్వేల్ సాక్షిగా బీటలు వారే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి బద్వేల్ ఉప ఎన్నిక జనసేన-బీజేపీ మధ్య చిచ్చుపెట్టేలా కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- ap
- badwell-by-poll
- bjp
- janasena
- ycp
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!