పెరిగిన టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటాలతో చేసే వంటలను పూర్తిగా చేసుకోవడం మానేశారు.. ప్రస్తుతం మార్కెట్ లో ధరలు రూ.200 పలుకుతుంది.. ఇక దీంతో గృహిణులు ఆచితూచి చూసి టమోటా తో వంటను వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దాంతో ఈ ఘటన వెలుగు చూసింది…
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో ధన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కూరలు చేస్తున్న సమయంలో.. సందీప్ భార్యకు తెలియకుండా టమాటా వినియోగింగాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.. భార్య ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో భర్త చేసేదిలేక సందీప్ ధన్పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు..
ఇక పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ ను తీసుకొని ట్రేస్ చేశారు.. ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్పురి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు. పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్యులే కాదు.. బంధాలు కూడా తెగిపోతున్నాయని అంటున్నారు.. ధరలు గొడవలు పెడుతున్న.. రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. వెంటనే ఏదొక నిర్ణయం తీసుకోవాలని సదరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
