Virat Kohli: విరాట్ కోహ్లీ మొబైల్ వాల్పేపర్గా ఆయన ఫోటో.. ఎవరీయన?
- విరాట్ కోహ్లీ ఫోన్ వాల్పేపర్పై ఫోటో..
- ఆ వాల్పేపర్పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో..
- ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెనర్ టాప్ బస్లో భారత క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వాంఖడే స్టేడియంలో క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఫోన్ వాల్పేపర్పై ఓ ఫోటో కెమెరా కంటికి చిక్కింది. ఇది తన సతీమణి అనుష్క దే కదా అనుకుంటే పొరపాటేనండోయ్. ఆ వాల్పేపర్పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో. ఇంతకీ.. నీమ్ కరోలి బాబా ఎవరు? విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ వాల్పేపర్గా అతని చిత్రం ఉంటే, ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
Read also: Hyderabad Bonalu: జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
నీమ్ కరోలి బాబాను నీబ్ కరోరి బాబా అని కూడా అంటారు. కరోలి బాబా అసలు పేరు లక్ష్మణ్ దాస్. 1958లో లక్ష్మణ్ దాస్ తన సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణిస్తుండడంతో కరోలి గ్రామ సమీపంలో టీటీ అతన్ని రైలు నుండి దింపేసింది. ఆ తర్వాత రైలు ముందుకు కదలదు. దీంతో సాధువును రైలు నుంచి దింపినందున రైలు కదలకపోవడంతో బాబాను ఎక్కించుకోవాలని ప్రయాణికులు సూచించడంతో టీటీ మళ్లీ రైలు ఎక్కించారు. అయితే.. రెండు షరతులతో బాబా మళ్లీ రైలు ఎక్కనున్నారు.

Read also: Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..
అదేమిటంటే.. కరోలి గ్రామంలో రైల్వేస్టేషన్ నిర్మించాలని రైల్వే అధికారులకు సిఫార్సు చేయడంతోపాటు సాధువులతో సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని కోరారట. టీటీ వారికి అంగీకరించి, లక్ష్మణ్ దాస్ రైలు ఎక్కిన తర్వాత, రైలు ముందుకు కదులుతుంది. అతను కరోలి గ్రామంలో అడుగుపెట్టాడు మరియు అక్కడ కొంతకాలం ఉన్నాడు, అందుకే అతనికి నీమ్ కరోలి బాబా అని పేరు వచ్చింది. అయితే.. మహారాజ్ జీ అని కూడా పిలుస్తారు. ఈ బాబాను హనుమంతుని రూపమని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లోని కరోలి బాబాకు దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆశ్రమం నైనితాల్ నుండి 65 కి.మీ దూరంలో పంత్నగర్లో ఉంది. 1900లో జన్మించిన కరోలి బాబా 1973లో మరణించారు.
Bharateeyudu 2: భాగ్యనగరంలో ‘భారతీయుడు 2’ సందడి.. గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!