Bangladesh: షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష.. అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు..
- బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి షాక్..
- కోర్టు ధిక్కారంపై కేసులో హసీనాకు ఆరు నెలల జైలుశిక్ష..
- హసీనాకు జైలు శిక్ష అంశంపై అంతర్జాతీయంగా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ తీర్పును ప్రకటించినట్లు ఢాకాకు చెందిన పలు మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి.
Read Also: Singayya Death Case: సింగయ్యను ఎవరో చంపేశారు.. భార్య సంచలన ఆరోపణలు
Also Read
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ఇక, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, గైబంధ జిల్లా గోవిందగంజ్కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్ ఢాకాకు చెందిన రాజకీయవేత్తగా, అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (BCL)తో సంబంధం కలిగి ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా మరియు షకీల్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, దానిపై ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదు అయింది.
అయితే, గత ఏడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితులతో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వదిలిన షేక్ హసీనా.. భారత్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతుంది. ఈ క్రమంలో ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై యూనస్ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ సైతం జారీ చేసింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు మహమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!