Bangladesh: షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష.. అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు..
- బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి షాక్..
- కోర్టు ధిక్కారంపై కేసులో హసీనాకు ఆరు నెలల జైలుశిక్ష..
- హసీనాకు జైలు శిక్ష అంశంపై అంతర్జాతీయంగా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ తీర్పును ప్రకటించినట్లు ఢాకాకు చెందిన పలు మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి.
Read Also: Singayya Death Case: సింగయ్యను ఎవరో చంపేశారు.. భార్య సంచలన ఆరోపణలు
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
ఇక, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, గైబంధ జిల్లా గోవిందగంజ్కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్ ఢాకాకు చెందిన రాజకీయవేత్తగా, అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (BCL)తో సంబంధం కలిగి ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా మరియు షకీల్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, దానిపై ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదు అయింది.
అయితే, గత ఏడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితులతో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వదిలిన షేక్ హసీనా.. భారత్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతుంది. ఈ క్రమంలో ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై యూనస్ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ సైతం జారీ చేసింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు మహమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?