Banke Bihari temple: చరణామృతంగా భావించి.. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తులు(వీడియో)
- ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తుల
- చరణామృతంగా భావిస్తున్న ప్రజలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఆ నీటిని తాగొద్దని అర్చకులు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు. దీన్ని ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణామృతంగా భావించి నీరు తాగుతున్న మహిళా భక్తురాలితో ఆ య్యూటూబర్ మాట్లాడుతూ.. ‘దీదీ.. ఇది చరణామృతం కాదు ఏసీ నీరు’ అని అంటాడు. దీంతో ఆ మహిళ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
READ MORE: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
బాంకే బిహారీ టెంపుల్ మొదటి అంతస్తులో వర్షపు నీరు పారుదల కోసం ఒక మార్గం ఉంది. దాని ఆకారం ఏనుగు నోరులా ఉంటుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు కూడా ఈ మార్గం గుండా పారుతూనే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఒక భక్తుడు తెలియకుండానే చరణామృతంగా భావించి చేతిలో పెట్టుకుని జపం చేయడం ప్రారంభించారని చెబుతున్నారు. కాసేపటికే వెనుక నుంచి వస్తున్న ఇతర భక్తులు కూడా ఆ నీటిని గ్లాసుల్లో నింపి తాగడం ప్రారంభించారు. దీన్ని ఆ భక్తులు చరణామృతంగా భావిస్తున్నారు. ఈ నీటిని తాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. చాలా మంది భక్తులు పాత్రల్లో నీటిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
READ MORE:Stock market: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇలా చేయవద్దని అర్చకుల విజ్ఞప్తి..
ఈ వీడియో బయటకు రావడంతో బాంకే బిహారీ ఆలయ పూజారులు అలా చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇది గుడ్డి భక్తి అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. అయితే.. దేశం, ప్రపంచం నుంచి ప్రతిరోజూ 10 నుండి 15 వేల మంది పర్యాటకులు మధుర, బృందావన్లకు వస్తున్నారు. ఈ చర్య వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK
— ZORO (@BroominsKaBaap) November 3, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!