Banke Bihari temple: చరణామృతంగా భావించి.. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తులు(వీడియో)
- ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తుల
- చరణామృతంగా భావిస్తున్న ప్రజలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఆ నీటిని తాగొద్దని అర్చకులు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు. దీన్ని ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణామృతంగా భావించి నీరు తాగుతున్న మహిళా భక్తురాలితో ఆ య్యూటూబర్ మాట్లాడుతూ.. ‘దీదీ.. ఇది చరణామృతం కాదు ఏసీ నీరు’ అని అంటాడు. దీంతో ఆ మహిళ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
READ MORE: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Also Read
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
- Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
బాంకే బిహారీ టెంపుల్ మొదటి అంతస్తులో వర్షపు నీరు పారుదల కోసం ఒక మార్గం ఉంది. దాని ఆకారం ఏనుగు నోరులా ఉంటుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు కూడా ఈ మార్గం గుండా పారుతూనే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఒక భక్తుడు తెలియకుండానే చరణామృతంగా భావించి చేతిలో పెట్టుకుని జపం చేయడం ప్రారంభించారని చెబుతున్నారు. కాసేపటికే వెనుక నుంచి వస్తున్న ఇతర భక్తులు కూడా ఆ నీటిని గ్లాసుల్లో నింపి తాగడం ప్రారంభించారు. దీన్ని ఆ భక్తులు చరణామృతంగా భావిస్తున్నారు. ఈ నీటిని తాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. చాలా మంది భక్తులు పాత్రల్లో నీటిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
READ MORE:Stock market: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇలా చేయవద్దని అర్చకుల విజ్ఞప్తి..
ఈ వీడియో బయటకు రావడంతో బాంకే బిహారీ ఆలయ పూజారులు అలా చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇది గుడ్డి భక్తి అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. అయితే.. దేశం, ప్రపంచం నుంచి ప్రతిరోజూ 10 నుండి 15 వేల మంది పర్యాటకులు మధుర, బృందావన్లకు వస్తున్నారు. ఈ చర్య వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK
— ZORO (@BroominsKaBaap) November 3, 2024
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..