Banke Bihari temple: చరణామృతంగా భావించి.. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తులు(వీడియో)
- ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తుల
- చరణామృతంగా భావిస్తున్న ప్రజలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఆ నీటిని తాగొద్దని అర్చకులు విజ్ఞప్తి
ఉత్తర ప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు. దీన్ని ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణామృతంగా భావించి నీరు తాగుతున్న మహిళా భక్తురాలితో ఆ య్యూటూబర్ మాట్లాడుతూ.. ‘దీదీ.. ఇది చరణామృతం కాదు ఏసీ నీరు’ అని అంటాడు. దీంతో ఆ మహిళ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
READ MORE: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
- Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
బాంకే బిహారీ టెంపుల్ మొదటి అంతస్తులో వర్షపు నీరు పారుదల కోసం ఒక మార్గం ఉంది. దాని ఆకారం ఏనుగు నోరులా ఉంటుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు కూడా ఈ మార్గం గుండా పారుతూనే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఒక భక్తుడు తెలియకుండానే చరణామృతంగా భావించి చేతిలో పెట్టుకుని జపం చేయడం ప్రారంభించారని చెబుతున్నారు. కాసేపటికే వెనుక నుంచి వస్తున్న ఇతర భక్తులు కూడా ఆ నీటిని గ్లాసుల్లో నింపి తాగడం ప్రారంభించారు. దీన్ని ఆ భక్తులు చరణామృతంగా భావిస్తున్నారు. ఈ నీటిని తాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. చాలా మంది భక్తులు పాత్రల్లో నీటిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
READ MORE:Stock market: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇలా చేయవద్దని అర్చకుల విజ్ఞప్తి..
ఈ వీడియో బయటకు రావడంతో బాంకే బిహారీ ఆలయ పూజారులు అలా చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇది గుడ్డి భక్తి అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. అయితే.. దేశం, ప్రపంచం నుంచి ప్రతిరోజూ 10 నుండి 15 వేల మంది పర్యాటకులు మధుర, బృందావన్లకు వస్తున్నారు. ఈ చర్య వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK
— ZORO (@BroominsKaBaap) November 3, 2024
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!