Banke Bihari temple: చరణామృతంగా భావించి.. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తులు(వీడియో)
- ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తుల
- చరణామృతంగా భావిస్తున్న ప్రజలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఆ నీటిని తాగొద్దని అర్చకులు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు. దీన్ని ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణామృతంగా భావించి నీరు తాగుతున్న మహిళా భక్తురాలితో ఆ య్యూటూబర్ మాట్లాడుతూ.. ‘దీదీ.. ఇది చరణామృతం కాదు ఏసీ నీరు’ అని అంటాడు. దీంతో ఆ మహిళ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
READ MORE: IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Also Read
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
బాంకే బిహారీ టెంపుల్ మొదటి అంతస్తులో వర్షపు నీరు పారుదల కోసం ఒక మార్గం ఉంది. దాని ఆకారం ఏనుగు నోరులా ఉంటుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు కూడా ఈ మార్గం గుండా పారుతూనే ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఒక భక్తుడు తెలియకుండానే చరణామృతంగా భావించి చేతిలో పెట్టుకుని జపం చేయడం ప్రారంభించారని చెబుతున్నారు. కాసేపటికే వెనుక నుంచి వస్తున్న ఇతర భక్తులు కూడా ఆ నీటిని గ్లాసుల్లో నింపి తాగడం ప్రారంభించారు. దీన్ని ఆ భక్తులు చరణామృతంగా భావిస్తున్నారు. ఈ నీటిని తాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. చాలా మంది భక్తులు పాత్రల్లో నీటిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
READ MORE:Stock market: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇలా చేయవద్దని అర్చకుల విజ్ఞప్తి..
ఈ వీడియో బయటకు రావడంతో బాంకే బిహారీ ఆలయ పూజారులు అలా చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇది గుడ్డి భక్తి అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. అయితే.. దేశం, ప్రపంచం నుంచి ప్రతిరోజూ 10 నుండి 15 వేల మంది పర్యాటకులు మధుర, బృందావన్లకు వస్తున్నారు. ఈ చర్య వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Serious education is needed 100%
People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK
— ZORO (@BroominsKaBaap) November 3, 2024
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?