Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్తోపాటు మరింత మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Nadella, GMR: మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్యనాదెళ్ల.. క్రికెట్లోకి అడుగుపెట్టారు. అమెరికాలో కొత్తగా ప్రారంభమవుతున్న టీ20 టోర్నీలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. మేజర్ లీగ్ క్రికెట్గా పేర్కొనే ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఒక టీమ్ని సత్యనాదెళ్ల ఫైనాన్షియల్గా ప్రమోట్ చేయనున్నారు. ఆ జట్టు పేరు.. సియాటల్ ఆర్కాస్.
దీనికి సంబంధించిన ఫ్రాంచైజీ నిర్వహణ కోసం ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రికెట్ లీగ్ జులైలో లాంఛ్ కాబోతోంది. సియాటల్ గ్రూప్లో సత్యనాదెళ్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు జీఎంఆర్ గ్రూప్ సహా పలువురు ప్రముఖులు కూడా పార్ట్నర్లు అవుతున్నారు. ఈ మేరకు.. మేజర్ క్రికెట్ లీగ్ ఒక ప్రకటన చేసింది. ఆర్కాస్ అనేది సియాటల్ ఏరియాలోని సముద్రంలో సంచరించే ప్రమాదకరమైన తిమింగళం పేరు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?
ప్రాణాంతకమైన ఈ జీవిని.. శక్తికి మరియు బలానికి చిహ్నంగా భావిస్తారు. సియాటల్ ఆర్కాస్ జట్టులో సత్యనాదెళ్లతోపాటు సోమ సోమసేగర్, సమీర్ బోడాస్, అశోక్ కృష్ణమూర్తి, సంజయ్ పార్థసారధి వంటివాళ్లు సైతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జులై 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెక్సాస్లోని డల్లాస్లో జరుగుతుంది.
ఒక్కో టీమ్లో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లు ఉంటారు. ఇందులో 9 మంది విదేశీ ఆటగాళ్లు కాగా మ్యాచ్లో పాల్గొనే 11 మందిలో మినిమం ఆరుగురు లోకల్ ఆటగాళ్లు ఉంటారు. ఇదిలాఉండగా.. ఇండియన్ క్రికెట్లో మెగా సక్సెస్ అయిన ఐపీఎల్ ప్రయోగం ఇప్పుడు అమెరికాకి కూడా పాకిందని దీన్నిబట్టి చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?