Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salary Hike Time: కొత్త సంవత్సరం వచ్చి మూడు నెలలవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ సమయంలో ఉద్యోగులు తమ వేతనాలు ఏ మేరకు పెరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రానుండటంతో కొన్ని ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు శాలరీ హైక్ ఆశిస్తారు. పర్సనల్ ఫైనాన్సియల్ ప్లానింగ్ వేసుకుంటారు.
పెరిగే జీతాలు మార్చి నెల శాలరీతోపాటు ఇస్తారా లేక ఏప్రిల్ నెల వేతనంతో కలిపి ఇస్తారా అంటూ లెక్కలేసుకుంటారు. ఇదిలాఉంటే.. మరి.. సంస్థలు ఏం ఆలోచిస్తాయి?. జీతాలను 5 శాతం పెంచుతాయా? 10 శాతం పెంచుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు సంస్థలు డిటెయిల్డ్గా స్టడీ చేశాయి. ఆ అధ్యయన ఫలితాలను బట్టి చూస్తే.. కంపెనీలు శాలరీలను పెంచే సమయంలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
Also Read
- Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
- Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
- Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
read more: Airtel Vs Jio: జియో, ఎయిర్టెల్ మధ్య పోటీ. కస్టమర్ల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ముందుగా సంస్థ ఆర్థిక పరిస్థితితోపాటు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా పరిశీలిస్తాయి. సమీప భవిష్యత్తులో దేశంలో ఆర్థికమాంద్యం వస్తుందా? కేంద్ర బ్యాంకు.. వడ్డీ రేట్లను పెంచుతుందా? ఒక వేళ ఇలాంటి పరిస్థితులే ఉంటే వేతనాల పెంపుపై ఎంత పరిమితి పెట్టాలి? అనే దిశగా యాజమాన్యాలు చూస్తాయి. కొన్ని సందర్భాల్లో లేఆఫ్లకు సైతం వెనకాడవు.
అదే సమయంలో.. మంచి ఉద్యోగులను వదులుకోవు. ట్యాలెంటెడ్ పీపుల్ని ఎంత బాగా వినియోగించుకోవాలా అని ప్రణాళికలు వేస్తాయి. అవసరమైతే.. శాలరీ హైక్తోపాటు ప్రమోషన్లు కూడా ఇస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం కంపెనీ ఖర్చుల మీద పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతాయి. సంస్థ పనితీరు, సాధించిన లక్ష్యాలు, మార్కెట్లోని పోటీ వాతావరణం, ఉద్యోగుల వేతనాల్లోని అసమానతలు, టార్గెట్ ప్రమోషన్ రేట్, టర్నోవర్, నగదు నిల్వలు, చెల్లింపులు, కొత్త ఉద్యోగుల నియామకాలు, ఎక్కువ కాలంగా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ తదితర అంశాలు వేతనాల పెంపు విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అయితే.. ఇండియాలో యావరేజ్ శాలరీ హైక్.. టెన్ పర్సెంట్ ఉంటుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలతో పోల్చితే మన దేశంలోనే వేతనాల పెంపు ఎక్కువ శాతం ఉంటుందని పేర్కొంటున్నాయి. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, హైటెక్ సెక్టార్లలో శాలరీ హైక్ 9 పాయింట్ 8 శాతం ఉంటుందని కార్న్ ఫెర్రీ అనే సంస్థ తన సర్వేలో అంచనా వేసింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్, ఫార్మా, బయోటెక్, కెమికల్స్, రిటైల్ రంగాల్లో వేతనాల పెంపు ఎక్కువగా ఉంటుందని WTW సర్వే తెలిపింది. ఇ-కామర్స్, టెక్ ప్లాట్ఫామ్లు, ప్రొడక్ట్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, టెక్ కన్సల్టింగ్, సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఎఫ్ఎంసీజీ వంటి సెక్టార్లు సైతం ఈ ఏడాది అధిక వేతనాలను చెల్లిస్తాయని ఎయాన్ సర్వే వెల్లడించింది.
శాలరీ హైక్ విషయంలో.. కరోనా పీరియెడ్, వర్క్ ఫ్రం హోం, రిమోట్ అండ్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్స్ తదితర ఫ్యాక్టర్స్నీ పరిగణనలోకి తీసుకుంటారు. మేల్, ఫిమేల్ ఎంప్లాయీస్కి సమాన వేతనాలు, ఉన్నట్టుండి జాబ్ మానేయటం, మూన్లైటింగ్, ఫ్రీల్యాన్స్, గిగ్ వర్క్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్గా.. ముఖ్యమైన అంశం ఏంటంటే.. వేతనం ఎప్పుడు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఎప్పుడు చేతికొస్తుందనేవి ఉద్యోగుల మనసులో మెదిలే టాప్ మోస్ట్ టాపిక్లైతే కావొచ్చు.
కానీ.. యాజమాన్యాలు కూడా ఇలాగే ఆలోచించాలనే రూలేమీ లేదు. కాబట్టి.. శాలరీ.. హైక్ అయినా కాకపోయినా మన పనేదో మనం చేసుకుపోవాలనే మైండ్సెట్ని ఎంప్లాయీస్ డెవలప్ చేసుకోవటం కెరీర్కి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వేతనానికి తగిన ఆర్థిక ప్రణాళికతో లైఫ్లో ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..