దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడు పైనే ఎక్కువగా ఉంటుంది. 10,11,12 తేదీలలో బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం నిషేధించారు. అయితే దక్షిణ తమిళనాడు పై ఎక్కువ ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక చెన్నై వర్షాలపై తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. చెన్నై లోని ప్రభుత్వ పాఠశాలలు, మండపాలు వెంటనే తెరవాలని ఆదేశాలు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలను ముందే అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక పులాల్ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో… 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు అధికారులు. ఇన్ ఫ్లో ప్రస్తుతం 1500 క్యూసెక్కులుగా ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం… దక్షిణ తమిళనాడు పై ఎక్కువ ప్రభావం
