ఐపీఎల్ 2021 మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. అయితే ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూరు జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ మరో ఓపెనర్ దేవదత్ పాడికల్(34) , మాక్స్వెల్ (22) పరుగులతో కొంత భాగసౌమ్యని నెలకొల్పడంతో జట్టు లక్ష్యం వైపుకు సాగింది. కానీ వారు ఇద్దరు ఔట్ అయిన తర్వాత చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటుగా మిగిత బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులే చేసింది. దాంతో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై మళ్ళీ మొదటి స్థానానికి చేరుకుంది.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ డు ప్లెసిస్ అర్ధశతకంతో అదరగొట్టగా చివర్లో రవీంద్ర జడేజా(62) రెచ్చిపోయాడు. ఒక్కే ఓవర్లో 36 పరుగులు బాదాడు. దాంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.